Gossipsజోరు మీద ఉన్న బాలయ్య సినిమా రైట్స్

జోరు మీద ఉన్న బాలయ్య సినిమా రైట్స్

జై సింహా సినిమాతో పంజా విసరాలని చూస్తున్న బాలయ్య మంచి జోరు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. బాలయ్య జోరు మీద సినిమాలు చెయ్యడం అవి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటుండడంతో బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. సినిమా సినిమాకి మార్కెట్ పెంచుకుంటూ పోతుండడంతో బాలయ్యా మజాకా అంటున్నారు ఆయన అభిమానులు.

గౌతమిపుత్ర శాతకర్ణి తో ఆయన 50 కోట్ల మార్కెట్లో చేరిపోయి అందరికి దడ పుట్టిస్తున్నాడు ఈ నటసింహం. బాలయ్య మార్కెట్ అమాంతం పెరిగిపోవడంతో ఈయన చేస్తున్న సినిమాలు రైట్స్ భారీగా రేట్లు పలుకుతున్నాయి. ఇప్పటికే పైసా వసూల్ చిత్రం 46 కోట్ల మార్కెట్ చేయగా ఇప్పుడు తాజాగా బాలయ్య సినిమా జై సింహా 50 కోట్ల మార్కెట్ కి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.

థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే కొన్ని చోట్ల బాలయ్య గత మార్కెట్ కంటే ఎక్కువ రేటుకే జైసింహా రైట్స్ సోల్డ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా తూర్పుగోదావరి రైట్స్ ని 2 .75 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇంత రేటుకి ఈ జిల్లాలో అమ్ముడుపోవడం బాలయ్య కెరియర్లోనే రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే విపరీతమైన హైప్ పెరగడం వలన రైట్స్ ఇలా భారీ రేటుకి అమ్ముడుపోతున్నాయి. ఇదే విధంగా అన్ని ప్రాంతాల నుంచి ఆఫర్స్ వస్తుండడంతో ఈ సినిమా మీద హోప్స్ పెరిగిపోయాయి. అలాగే వీటితోపాటు సాటిలైట్, హిందీ, ఆడియో రైట్స్ అన్ని కలిపి ఈ సినిమా 50 కోట్ల బిజినెస్ చేయవచ్చనే అంచనా వేస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీ కళ్యాణ్ నిర్మాతగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నఈ సినిమాలో బాలయ్య పక్కన నయనతార, హరిప్రియ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news