Gossipsకొరియా తెర పై రావణుడి దండ యాత్ర..!

కొరియా తెర పై రావణుడి దండ యాత్ర..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాశి ఖన్నా, నివేద థామస్ జంటగా నటించిన చిత్రం ‘జై లవ కుశ’ ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్ లో బారి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. మొదటి సారి ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో అభిమానులని ఈ మూవీ ద్వారా అలరించారు. ఎన్టీఆర్ నటవిశ్వరూపం కనబరచిన చిత్రం జై లవ కుశ. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఒక అరుదైన ఘనతని సాధించింది. ఏ ఒక్క తెలుగు సినిమాకి దక్కని రికార్డు ని ఎన్టీఆర్ సినిమా సాధించింది.

సౌత్ కొరియా లో జరిగే బూచియాన్ అంతర్జాతీయ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ కి ‘జై లవ కుశ’ నామినేట్ అయ్యింది. కొరియా వేదిక పై ప్రదర్శిస్తున్న మొట్ట మొదటి తెలుగు చిత్రం ‘జై లవ కుశ’ కావటం విశేషం. ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీ మరియు ఎన్టీఆర్ అభిమానులని చాల గర్వ పడేలా చేసింది. ఈ నెల 21 మరియు 22 న ఈ చిత్రం సౌత్ కొరియా సినీ వేడుక లో ప్రదర్శించనున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news