Gossipsజై లవ కుశ చేయమని ఎన్టీఆర్ కు చెప్పింది వీళ్లేనా..!

జై లవ కుశ చేయమని ఎన్టీఆర్ కు చెప్పింది వీళ్లేనా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేష్న్ లో వచ్చిన జై లవ కుశ మరోసారి ఎన్.టి.ఆర్ స్టామినా ఏంటో చూపించింది. 150 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దుమ్ముదులిపేసిన ఈ సినిమా ఆడియోలో తారక్ ఓ మాట చెప్పాడు. బాబి చెప్పిన ఈ కథ తనకు బాగా నచ్చిందని అయితే ఈ సినిమా చేయడానికి మరో ఇద్దరు ముఖ్య వ్యక్తులు కారణమని అన్నాడు.

ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరా అని అప్పట్లో పెద్ద డిస్కషన్సే జరిగాయి. అయితే ఆ విషయం సక్సెస్ తర్వాత వెళ్లడిస్తామని చెప్పినా అది కుదరలేదు. ఇక ట్విట్టర్ లో ఈ విషయంపై ఆ సినిమాకు స్క్రీన్ ప్లే అందించిన కోనా వెంకట్ ను అడిగితే ఆ ఇద్దరు పేర్లు రివీల్ చేశారు. వారెవరో కాదు ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ. ఎన్.టి.ఆర్ కు సన్నిహితులైన ఈ ఇద్దరితో ఈ సినిమా గురించి ప్రస్తావించాడట. ఇద్దరు కూడా పాజిటివ్ స్పందించి సినిమా చేయమని చెప్పారట.

మొత్తానికి ఎన్.టి.ఆర్ జై లవ కుశ చేయడానికి పరోక్షంగా రాజమౌళి, కొరటాల శివలు కూడా కారణమయ్యారు. ఇక ప్రస్తుతం ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమా చేస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news