Moviesకలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఫిదా...అప్పుడే ఆ క్లబ్ లోకి.... ?

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఫిదా…అప్పుడే ఆ క్లబ్ లోకి…. ?

వరుణ్ తేజ్, ‘ప్రేమమ్’ బ్యూటీ సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ఫిదా సినిమా నిర్మాతకి లాభాల పంట పండిస్తోంది. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచే కాకుండా విమర్శకుల నుంచి సైతం మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకుంటోంది. నేటితో విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్న ఫిదా సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.33 కోట్ల షేర్ రాబట్టి త్వరలోనే రూ. 35 కోట్ల షేర్ మార్కుని అందుకోనుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఫిదా నిజంగానే నిర్మాత దిల్ రాజుని ఫిదా చేస్తోంది.

తమ సినిమా రూ. 40 కోట్ల మార్కుని తాకడం ఖాయం అని ఫిదా యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. రేపు రిలీజ్ కానున్న సినిమాల ప్రభావం ‘ఫిదా’పై పడకపోతే, దిల్ రాజు అండ్ టీమ్ ఆశించినట్టుగానే ఆ సినిమా రూ. 40 కోట్ల మార్క్ తాకే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌తోపాటు పూర్తి తెలంగాణ యాసలో సాయి పల్లవి పాత్ర చెప్పిన డైలాగ్స్, ఎమోషన్ సీన్స్‌లో ఆమె చూపిన పర్‌ఫార్మెన్స్ ‘ఫిదా’ ఆడియెన్స్‌ని నిజంగానే ఫిదా చేస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news