Gossipsత్రివిక్రమ్ చేసిన పనికి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..

త్రివిక్రమ్ చేసిన పనికి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..

ఎన్టీఆర్ తొలిసారిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అరవింద సమేత సినిమా పై భారీ అంచనాలున్నాయి. మరోవైపు ప్రమోషన్ ఊపందుకోవాల్సిన సమయం కూడా వచ్చింది.
అయితే ఈ విషయంలో దర్శక నిర్మాతలు చాలా నెమ్మదిగా ఉండడం జూనియర్ అభిమానులకు నచ్చడంలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ మరికొద్ది గంటలలో ఈరోజు సాయంత్రం జరగబోతూ ఉన్నా ఆవిషయాలను పక్కకు పెట్టి దర్శక నిర్మాతల మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించే పనిలోపడ్డారు అభిమానులు.

‘మేల్కోండి హారికా హాసినీ’ అంటూ ఒక ట్యాగ్ పెట్టి ఈమూవీ నిర్మాతలకు తమ ట్విట్స్ ద్వారా తమ నిరసనలు తెలియజేస్తున్నారు. జై లవకుశ సూపర్ హిట్ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్,త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రఘువ.వరుస సక్సెస్ లా తరువాత వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలపై ఫ్యాన్స్ ఆగ్రహం చెండానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.

ఈ సినిమా విడుదలకు కేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్నా ఈమూవీకి సంబంధించిన స్టిల్స్, పోస్టర్స్ ను చాల తక్కువగా విడుదల చేస్తున్నారు అని జూనియర్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఈసినిమా ప్రమోషన్ కు సంబంధించిన పనులను త్రివిక్రమ్ పి ఆర్ టీమ్ జూనియర్ పి ఆర్ టీమ్ వేరువేరుగా చూస్తున్న నేపధ్యంలో ఈ ఇద్దరి వ్యక్తుల పి ఆర్ టీమ్స్ మధ్య వచ్చిన ఇగో సమస్యలు ‘అరవింద సమేత’ ప్రమోషన్ ను దెబ్బ తీస్తున్నాయని జూనియర్ అభిమానుల వాదన.

అంతే కాకుండా ఈ మూవీ ట్రైలర్ ను ఉదయం కాకుండా రాత్రి 8. 10 నిమిషాలకు విడుదల చేస్తుండడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే త్రివిక్రమ్ ఇంతకు ముందు తీసిన సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. ఈ నేపథ్యంలో ‘అరవింద సమేత’ విషయంలో ఎక్కడా ఎలాంటి పొరపాటు జరుగకుండా జాగ్రతలు తీసకుంటున్నాడు. సీన్ చిత్రీకరణ అనంతరం రెండు మూడు సార్లు రివ్యూ చేసుకుని అవసరం అనుకుంటే రీటేక్స్ చేయిస్తున్నాడట.ఈ సినిమాలో ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా డైలాగులు, స్క్రీన్ ప్లే డిజైన్ చేశారని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news