Gossipsఎన్టీఆర్, చరణ్ ని నమ్ముకుని 50 కోట్లు వదులుకున్న ప్రొడ్యూసర్

ఎన్టీఆర్, చరణ్ ని నమ్ముకుని 50 కోట్లు వదులుకున్న ప్రొడ్యూసర్

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ మల్టీస్టారర్ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ ట్రిపుల్ ఆర్ పెట్టగానే అది కాస్త టాప్ ట్రెండింగ్ అయ్యింది. సినిమా ఎలా లేదన్నా బాహుబలి కలక్షన్స్ కు దగ్గరగా వెళ్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న దానయ్యకు 50 కోట్ల ఆఫర్ వచ్చిందట. మరో బడా నిర్మాత ఈ ప్రాజెక్ట్ తనకు ఇచ్చేస్తే అక్షరాల 50 కోట్లు తనకు ఇస్తానని అన్నాడట.

దానయ్య మాత్రం అందుకు ఒప్పుకోలేదట. రాజమౌళి డైరక్టర్.. 200 కోట్ల బడ్జెట్.. ఎలా లేదన్నా సినిమా 500 నుండి 600 కోట్ల మార్కెట్ చేస్తుంది. అన్ని ఖర్చులు పోయినా ఈ ప్రాజెక్ట్ దానయ్యకు 100 కోట్లు పైగానే మిగుల్చుతుంది. కాబట్టి ముందుచూపుతోనే 50 కోట్ల ఆఫర్ ను తోసిపుచ్చాడు దానయ్య. సినిమా నిర్మాణ కష్టం లేకుండానే 50 కోట్లు వస్తుంటే తీసుకోని దానయ్య.. రాజమౌళి డైరక్షన్ లో మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా తన పేరు మీద ఉండాలని ఫిక్స్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news