Gossipsదేవి శ్రీ ప్రసాద్కు పొగబెట్టిన మహర్షి..!

దేవి శ్రీ ప్రసాద్కు పొగబెట్టిన మహర్షి..!

టాలీవుడ్ లో ఇప్పుడున్న సంగీత దర్శకుల్లో దేవి శ్రీ ప్రసాద్ టాప్ పొజిషన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు అయితే తమ సినిమా సగం విజయవంతం అయినట్లేనని సినియూనిట్ అభిప్రాయం. అలాంటి దేవి శ్రీ ప్రసాద్ను ఇప్పుడు ఓ మెగా హీరో వదిలించుకోవాలని చూస్తున్నాడట. అందుకు కారణం ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమానే కారణం.

ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల ఆగ్రహానికి డీఎస్పీ బలయ్యాడు. మహర్షి సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో డీఎస్పీ సంగీతం బాగా లేదని ప్రిన్స్ అభిమానులు గోలగోల చేశారు. దీంతో డీఎస్పీ సంగీతంపై నీలినీడలు అలుముకున్నాయి. దేవి సంగీతం ఒకే తీరుగా ఉంటుందని కొత్తదనం లేకుండా పోయిందని, పాత ట్యూన్లనే మళ్ళీ మళ్ళీ వాడుతున్నాడని మహేష్బాబు అభిమానులు సోషల్ మీడియాలో వార్త హల్ఛల్ చేస్తుంది. మహేష్బాబు అభిమానుల ఆగ్రహాన్ని చూసిన మెగా కుటుంబానికి చెందిన హీరో తన సినిమాలో అవకాశం చేజార్చాడట.

మెగా కుటుంబ హీరో వరుణ్తేజ్ వాల్మీకి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ జిగర్ తాండ సినిమాకు రీమేక్గా ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, ముందుగా దేవి శ్రీ ప్రసాద్ను సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. పూజా హెగ్డేను హీరోయిన్గా అనుకున్నారు. అయితే హీరోయిన్ పూజాహెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. ఇప్పడు దేవి శ్రీ ప్రసాద్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్న ప్రచారం సిని పరిశ్రమలో జోరుగా సాగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news