Gossipsఅరె ఏమైంది.. శ్రీను వైట్ల అన్నంత పనీ చేశాడే?

అరె ఏమైంది.. శ్రీను వైట్ల అన్నంత పనీ చేశాడే?

అనుకున్న విధంగా సినిమా ఆడ‌లేదు. అనుకున్న ప్ర‌కారం అత‌డు మాట త‌ప్ప‌లేదు. నిర్మాత క‌ష్టం తెలిసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు.అత‌డే శ్రీ‌నువైట్ల‌. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేం చేసినా ఇప్పుడు పెద్ద‌గా వ‌ర్కౌట్ కావ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. మిస్ట‌ర్ సినిమా కూడా ఆయ‌న‌కు చేదు అనుభ‌వ‌మే మిగిల్చింది. పెద్ద‌గా ఎక్క‌డా పాజిటివ్ టాక్ తెచ్చుకోకుండానే ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిపోయిందో తెలియ‌కుండానే అంతా క్ష‌ణాల్లో జ‌రిగిపోయింది.

ఓ డిజాస్ట‌ర్ త‌రువాత ఏం చేయాలి?నిర్మాత‌ను ఏ విధంగా ఆదుకోవాలి ? అన్న‌వి ఇండ‌స్ట్రీలో ఎవ్వ‌రూ పెద్ద‌గా ఆలోచించ‌రు.కానీ శ్రీ‌ను మాత్రం ఈ చిత్రం పరాజయం పాలైతే, నష్టపరిహారం చెల్లిస్తానని ముందే నిర్మాతకు మాటిచ్చారట. అందులో భాగంగానే తన పారితోషికం నుంచి రూ.85 లక్షలు తిరిగి చెల్లించాడ‌ట‌. ‘మిస్టర్‌’ కోసం శ్రీనువైట్ల దాదాపుగా రూ.3 కోట్ల పారితోషికం తీసుకొన్నారని సమాచారం.ఈ మొత్తంలో ముందు అనుకున్న‌ట్లే కొంత మొత్తాన్ని వెన‌క్కి  ఇచ్చేసి  ఇచ్చిన మాట నిల‌బెట్టుకుని నిర్మాతకు ఆర్థికంగా కాస్తో కూస్తో ఊర‌ట‌నిచ్చాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news