Gossipsఇద్దర్ని వేరు చేసిన రాజమౌళి

ఇద్దర్ని వేరు చేసిన రాజమౌళి

రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో ఒక భారీ మల్టి స్టారర్ సినిమాలను తెరకెక్కించబోతోన్న నేపథ్యంలో ప్రస్తుతం తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కలిసి కథా చర్చలు కొనసాగిస్తున్న రాజమౌళి ఇదే అదునుగా రెండు టీమ్స్ ను ముందే రెడీ చేసుకున్నాడు. ఒక టీమ్ మొత్తం రామ్ చరణ్ కి సంబందించిన సీన్స్ ని మరొక టీమ్ ఎన్టీఆర్ సీన్స్ ని టెస్ట్ షూట్ చేయనుందట. ఆ తర్వాత రెండు టీమ్ చేసిన సీన్స్ ను పరిశీలించి ఒక అభిప్రాయానికి వస్తాడట జక్కన్న.

రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కించనున్న ఈ మల్టీస్టారర్ సినిమా కు అన్నీ సక్రమంగా వచ్చేలా ఒక టీమ్ ను సెట్ చేసుకుంటున్నాడు. అన్నీ సెట్ చేసుకోకుండా షూటింగ్ స్టార్ట్ చెయ్యదు కదా మన జక్కన్న ఈ కోవలోనే మల్టీస్టారర్ కోసం తన టీమ్ ను రాజమౌళి రెండు భాగాలుగా విడదీసాడు.

ఇద్దరు హీరోలు ఇమేజ్ కి తగ్గట్టుగా బ్యాలెన్స్ గా సీన్లు వస్తున్నాయా లేదా అని తెలుసుకునేందుకు రాజమౌళి ఆ విధంగా ప్లాన్ చేశాడట. మల్టి స్టారర్ సినిమా చేయాలంటే చాలా పెద్ద రిస్క్. ఏ ఒక్క హీరోని తక్కువగా చూపించినా అభిమానులు మాత్రం రచ్చ రచ్చ చేసేస్తారు. ఈ విష్యం ముందే గ్రహించిన జక్కన్న అలాంటి కాంట్రవర్సీలు రాకుండా ముందే జాగ్రత్త పడుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news