Gossips"ఆదిత్య 369" సీక్వెల్ కి డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకే

“ఆదిత్య 369” సీక్వెల్ కి డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకే

బాలయ్య ఎక్కడా ఆగడంలేదు .. కుర్ర హీరోలకంటే నేనేమీ తీసిపోని అంటూ సినిమాల మీద సినిమాలు చేసేస్తూ … ఇండ్రస్ట్రీని షేక్ చేసేస్తున్నాడు. కొద్దీ రోజుల క్రితమే బాలయ్య నటించిన జైసింహా సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా .. మళ్ళీ ఓ సినిమా మొదలెట్టెయ్యడానికి రెడీ అయిపోయాడు. ఆ సినిమా అయినా వెంటనే రెండు మూడు సినిమాలు అప్పుడే క్యూ లో ఉన్నాయి. కేవలం సినిమాలు మాత్రమే కాదు బాలయ్య రెమ్యూనరేషన్ కూడా బాగా పెంచాడని తెలుస్తుంది. పైసా వసూల్ మూవీ నుండి రూ..10 కోట్ల వరకు ఒక్కో సినిమాకు తీసుకుంటున్నాడని సమాచారం.

ఒకప్పుడు తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్లిన ఎస్వీ కృష్ణారెడ్డి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆ మధ్యలో యమలీలకు సీక్వెల్‌ అందించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోర్లా పడటంతో ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి కలిసి పనిచేయడం కొత్తేమీ కాదు. గతంలో వీరి కాంబినేషన్‌లో టాప్ హీరో అనే సూపర్ హిట్ చిత్రం వచ్చింది. కానీ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు.

బాలకృష్ణ, కృష్ణారెడ్డి కలయికలో వచ్చే చిత్రం వచ్చే ఏడాదిలో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ అంతరిక్ష యాత్రికుడిగా నటించనున్నారు. పూర్తిగా ఇది పాంటసీ చిత్రమనే విషయంలో వార్తల్లోకి ఎక్కింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కాగా, బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మహేశ్‌తో కలిసి బాలయ్య మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారనే వార్త మీడియాలో సంచలనం రేపింది. అయితే ఈ ప్రాజెక్ట్‌ను బాలయ్య పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను పూర్తిగా పక్కనపెట్టారా .? లేక తాత్కాలికంగా వాయిదా వేసారా అనేది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news