Gossipsఎన్టీఆర్ సాక్షిగా రామ్ బెల్లంకొండ మధ్య వివాదం..

ఎన్టీఆర్ సాక్షిగా రామ్ బెల్లంకొండ మధ్య వివాదం..

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఉన్నది ఒక్కటే జిందగీ తో మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు . కిశోరె తిరుముల దర్శకత్వం లో వస్తున్నా ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది . మ్యూజిక్ ఆల్బం కి కూడా మంచి ఆదరణ లభించింది .

ఈ చిత్రం రీలీజ్ కి రెడీ అయినా సందర్భంగా రామ్ కి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి . ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కి రామ్ కి మధ్య చాల కాలంగా ఒక వివాదం నడుస్తుంది . కందిరీగ సినిమా తర్వాత అదే కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడట రామ్ . అడ్వాన్స్ గా ఒక కోటి రూపాయలు కూడా తీసుకున్నాడట . అయితే బెల్లంకొండ సురేష్ కు ఎన్టీఆర్ డేట్స్ దొరకడంతో ఆ సినిమా ఎన్టీఆర్ తో ‘రభస” గా తీసేశారంట .

అయితే రామ్ కి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగివ్వమని చాల సార్లు అడిగారట బెల్లంకొండ , కానీ పక్షం లో ఒక సినిమా చెయ్యాలని కూడా కోరారట . అయితే రామ్ అందుకు అంగీకరించలేదట . ఆ సినిమా నుండి తానూ తప్పుకోలేదని , ప్రొడ్యూసర్ ఏ తనను తప్పించారు కనుక అడ్వాన్స్ వెనక్కు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పారట రామ్ .

ఇప్పుడు ఉన్నది ఒక్కటే జిందగీ ప్రమోషన్ లో బిజీ గా వున్నా రామ్ కి బెల్లం కొండా రూపం లో షాక్ తగిలింది . ఆ కోటి తిరిగి చెల్లించకుంటే , చిత్రం రిలీజ్ కి అడ్డుపడతానని బెల్లంకొండ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట . చివరికి రామ్ కూడా తిరిగివ్వటానికి ఒప్పుకోక తప్పలేదట ..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news