Gossipsఎన్టీఆర్ సాక్షిగా రామ్,బెల్లంకొండ మధ్య వివాదం... ఇదంతా ట్రాష్..అసలు నిజం ఏంటీ...

ఎన్టీఆర్ సాక్షిగా రామ్,బెల్లంకొండ మధ్య వివాదం… ఇదంతా ట్రాష్..అసలు నిజం ఏంటీ ?

ఫ్లాష్‌..ఫ్లాష్‌
అదంతా ట్రాష్‌
హీరో రామ్ పై వ‌చ్చిన రూమ‌ర్స్ లో నిజం లేద‌య్యో
మ‌రి ఉన్న‌దేంటి ??
ఆ.. వివ‌ర‌మే చెబుతున్నారు సీనియ‌ర్ ప్రోడ్యూస‌ర్,
రామ్ పెద్ద‌నాన్న స్ర‌వంతి మూవీస్ అధినేత ర‌వికిశోర్

వివ‌రాలిలా :: ఇటీవల హీరో రామ్ – నిర్మాత బెల్లం కొండ సురేష్ కాంబో పై వచ్చిన ఒక రూమర్ తెగ హల్ చల్ చేసిన విష‌యం తెలిసిందే. గతంలో వీరిద్దరూ కందిరీగ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఆ..సినిమాను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించాడు. సినిమా హిట్ అవ్వ డంతో అదే ఊపులో ఈ టీమ్ కందిరీగ 2 తీద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది సెట్ అవ్వలేదు. అదే స్టోరీ జూనియర్ ఎ న్టీఆర్ తో రభస గా తీశారన్న‌ది ఓ టాక్‌. అయితే ఆ..ప్రాజెక్ట్ ఒప్పుకున్నపుడు రామ్ కి నిర్మాత బెల్లంకొండ సురేష్ అడ్వాన్స్ గా 1.5 కోట్లు ఇచ్చార ని, కానీ ఉన్న‌ట్టుండి ఆయ‌న తార‌క్ తో సినిమా తీయ‌డంతో, రామ్ ఇప్పటివరకు ఆ..రెమ్యునరేషన్ ని తిరిగి ఇవ్వలేద‌ని, ఆఖ‌రికి బెల్లం కొండ నుంచి హెచ్చ‌రిక‌లు జారీ అయిన నేప‌థ్యంలో డ‌బ్బు వెన‌క్కు ఇచ్చార‌న్న వార్త ఒక‌టి చ‌క్క‌ర్లు కొట్టింది.విషయం తెలుసుకున్న రామ్ పెదనాన్న స్రవంతి రవి కిశోర్ చాలా నవ్వు కున్నార‌ట.!అసలు ఇలాంటి అర్థంప‌ర్థం లేని రూమర్స్ ఎలా క్రియేట్ అవుతాయో తనకు అస్సలు అర్థం కాదని గత కొన్ని రోజులుగా తాను ఇక్కడ లేనని చెప్పారు.అదేవిధంగా హీరో రామ్ పై వ‌చ్చిన రూమర్స్ పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. సో..గాసిప్పు రాయుళ్లూ శాంతించ‌డ‌య్యా!! ఇప్ప‌టికైనా మీ మ‌న‌సు కుదుట‌ప‌డకుంటే మ‌రో ఫేక్ న్యూస్‌ని క్రియేట్ చేసి క‌డుపు నింపుకోండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news