Gossipsసైరా చిత్ర యూనిట్‌పై నిప్పులు చెరిగిన చిరు..

సైరా చిత్ర యూనిట్‌పై నిప్పులు చెరిగిన చిరు..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్‌ మూవీలో చిరు అదిరిపోయే స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమాలో భారీ స్థాయిలో నటీనటులు నటిస్తుండటంతో ప్యాన్ ఇండియా మూవీగా దీన్ని దేశవ్యాప్తంగా అనేక భాషల్లో రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఇక ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పాత్ర చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తోందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ పాత్ర చిరు పాత్రను డామినేట్ చేసే విధంగా ఉండటంతో అతడి పాత్ర నిడివిని తగ్గించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. ఈ విషయం చిరంజీవి దాగా చేరడంతో ఆయన చిత్ర యూనిట్‌పై నిప్పులు చెరిగాడు. తమిళంలో మంచి క్రేజ్‌ ఉన్న విజయ్ సేతుపతి పాత్రను తగ్గించడం ఏమిటీ అంటూ ఆయన దర్శకనిర్మాతలపై ఫైర్ అయ్యాడు. ఎలాంటి మార్పులు లేకుండా చిత్రాన్ని ముందుకుతీసుకెళ్లాలని ఆయన చిత్ర యూనిట్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

దీంతో ఎలాంటి కోతలు లేకుండానే చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్ కిచ్చా వంటి పాపులర్ యాక్టర్స్ నటిస్తున్న సైరా చిత్రంలో అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్ చరణ్ ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సై అంటోంది ఈ సినిమా.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news