Gossipsగొడవల కారణంగా చెర్రీ సినిమాల నుండి అయన అవుట్..

గొడవల కారణంగా చెర్రీ సినిమాల నుండి అయన అవుట్..

రంగస్థలం తర్వాత రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. అనుకున్న దాని కన్నా బడ్జెట్ ఎక్కువవడమే కాదు సినిమా షెడ్యూల్ కూడా పెరుగుతుందని తెలుస్తుంది. ఈ విషయంపై చిత్రయూనిట్ లో కొన్ని గొడవలు అయ్యాయట. అందుకే సినిమాకు ఇప్పటిదాకా పనిచేసిన రిషి పంజాబి సినిమా నుండి ఎక్సిట్ అయ్యాడని తెలుస్తుంది.

సినిమా 70 శాతం వరకు షూటింగ్ చేయగా ఇప్పుడు అతను వెళ్లడంపై అనుమానాలు వస్తున్నాయి. బోయపాటితో గొడవ వల్లే అతని ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లాడని తెలుస్తుంది. రిషి పంజాబి బదులు ఆర్ధర్ విల్సన్ చరణ్ సినిమాలో జాయిన్ అయ్యాడట. రిషి వెళ్లడానికి తన ఇతర సినిమాల కమిట్మెంట్ కూడా ఒక కారణమని అంటున్నారు.

2019 సంక్రాంతి రిలీజ్ ప్లాన్ చేస్తున్న చరణ్ సినిమా నుండి కెమెరా మెన్ బయటకు రావడం మెగా ఫ్యాన్స్ లో అనుమానాలు వచ్చేలా చేస్తుంది. అల్లు అర్జున్ కు సరైనోడు సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి చరణ్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి. ఈ సినిమాకు టైటిల్ గా వినయ విధేయ రామా అని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news