Gossipsహీరోని పొగిడిన విలన్...

హీరోని పొగిడిన విలన్…

బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ కెరియ‌ర్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆయ‌నేం చేసినా వార్తే! వార్ జోన్ నుంచి వ‌చ్చి చాలా కాలం అయిన‌ప్ప‌టి కీ వార్త‌ల జోన్ నుంచి మాత్రం త‌ప్పుకోలేక‌పోతున్నాడు. తాజాగా యూవీ క్రియేష‌న్స్ సంస్థ భారీ బ‌డ్జెట్ తో సాహో చిత్రాన్ని రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే! ఈ సినిమాని ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ తెరెకెక్కిస్తుండ‌గా బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేశ్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ని పోషిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా ప్ర‌భాస్‌ని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నాడీయ‌న‌. ప్ర‌భాస్ నిజంగానే డార్లింగేన‌ని పేర్కొంటూ ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని ప‌దే ప‌దే కీర్తిస్తున్నాడు. ఇటీవల ముఖేశ్ పై కొన్ని స‌న్నివేశాల‌ను షూట్ చేశారు.ఇందుకు సంబంధించిన విశేషాల‌ను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు. ‘ప్రభాస్‌ నిజంగా డార్లింగే. శ్రద్ధాకపూర్‌ కూడా అమేజింగ్‌. త్వరలో మీ ఇద్దరినీ సెట్‌లో చూడాలనుకుం టున్నాను. గాడ్‌ బ్లెస్‌’ అని పేర్కొన్నారు. కాగా ఈ సినిమా టీజ‌ర్ ని ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 23న విడుద‌ల చేసేందుకు  స‌న్నాహాలు చేస్తున్నారు.

కాగా ఈ సినిమాతో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ త‌న మార్కెట్ ని విస్తృతం చేసుకోవాల‌న్న‌ది ప్ర‌భాస్ ప్లాన్. ర‌న్ రాజా ర‌న్ హిట్ త‌రువాత చాలా కాలం పాటు ఈ సినిమా కోస‌మే త‌న స‌మ‌యం అంతా వెచ్చించాడు డైరెక్ట‌ర్ సుజిత్‌.బాహుబ‌లి 2 షూటింగ్ కార‌ణంగా ప్ర‌భాస్ కూడా ఈ సినిమాని త్వ‌రిత‌గ‌తిన ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు.ఇప్పుడీ సినిమా ప‌నులు జోరందుకోవ‌డంతో యూనిట్ మొత్తం హ్యాపీగా ఉంది. ఈ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ లో అడుగిడుతున్న శ్ర‌ద్ధా క‌పూర్ అందాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కానున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news