Gossipsమెగా ఫ్యామిలీ పై ఏపీ ప్రభుత్వం వివక్ష

మెగా ఫ్యామిలీ పై ఏపీ ప్రభుత్వం వివక్ష

ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులు తాజాగా వివాదాస్పదం అవుతున్నాయి. నంది అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుందని గీతా ఆర్ట్స్ గ్రూప్ లో కీలక వ్యక్తిగా ఉన్న బన్నీ వాసు ఆవేదన వ్యక్తం చేశాడు.

మూడేళ్లకు ప్రకటించిన నంది అవార్డుల్లో మెగా కుటుంబానికి చెందిన ఒక్క హీరోకు కూడా ఉత్తమ నటుడు అవార్డు రాలేదని అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూడేళ్ల కాలంలో మెగా హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి, మెప్పించారు అలాంటి వాళ్ళను నిర్లక్ష్యం చేశారని అన్నారు.

రెండు కమర్షియల్ హిట్స్ ఇచ్చిన అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడంపై అయన మండిపడ్డాడు.. ఈ రెండు సినిమాలకు గాను అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు దక్కుతుందని ఆశించాం. కానీ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు రావడం మెగా ఫ్యామిలీని అవమానించడమేనని చెప్పారు.

గతంలో మగధీర విషయంలోనూ ఇదే జరిగింది. మగధీర సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినా, రాష్ట్ర స్థాయిలో మాత్రం గుర్తింపు దక్కలేదని బన్నీ వాసు అంటున్నాడు. మెగా ఫ్యామిలీకి అన్యాయంపై బన్నీ వాసు నోరు విప్పారు. ఆయనకు మద్దతుగా ఇంకెంత మంది స్పందిస్తారో.. ఇంకెంతమంది రగిలిపోతున్నారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news