Gossipsబ్రహ్మీని ఇచ్చిన షాక్ కి.. కన్నీళ్లు పెట్టిన తారక్..?

బ్రహ్మీని ఇచ్చిన షాక్ కి.. కన్నీళ్లు పెట్టిన తారక్..?

ఎన్టీఆర్ కి గత కొంతకాలంగా దూరం అయిన ఆత్మీయులంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా దగ్గరకు చేరుతున్నారు. ఆత్మీయులంతా ఇలా తనతో కలిసిపోవడం ఎన్టీఆర్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. తాజాగా… అరవింద సమేత విజయోత్సవ వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒకే వేదికపై కనిపించడంతో ఈవెంట్ మొత్తం ఉత్సాహభరితంగా సాగింది. చాలా కాలం తరువాత బాలయ్య, ఎన్టీఆర్ మధ్య ఆప్యాయతానురాగాలు చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు.

ఈ ఆనందంలో ఉన్న ఎన్టీఆర్ కి నారా బ్రాహ్మణి స్వయంగా ఓ గిఫ్ట్ పంపినట్లు తెలుస్తోంది. ఆ గిఫ్ట్ చూసి ఎన్టీఆర్ భావిద్వేగానికి గురయ్యాడట. ఇటీవల నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హరికృష్ణ మధుర జ్ఞాపకాలు నందమూరి హరికృష్ణ మధుర జ్ఞాపాలకు సంబందించిన ఫొటోలన్నింటితో ఆల్బమ్ రూపొందించిన బ్రాహ్మిణి దానిని ఎన్టీఆర్ కు గిఫ్ట్ గా పంపిందట. చెల్లెలు పంపిన గిఫ్ట్ తో ఎన్టీఆర్ భావోద్వాగానికి గురయ్యాడట. దసరా సందర్బంగా తన తండ్రిని మనస్ఫూర్తిగా తలుచుకునేలా చేసిన తన చెల్లలు నారా బ్రాహ్మణి కి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు చెప్పాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news