Gossipsబోయపాటి ఆ విషయంలో రివర్స్ అయ్యారా..!

బోయపాటి ఆ విషయంలో రివర్స్ అయ్యారా..!

టాలీవుడ్ లో ఈ మద్య స్టార్ డైరెక్టర్లు తీస్తున్న సినిమాలు అంచనాలు ఘోరంగా దెబ్బ తింటున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలకు సూపర్ హిట్ సినిమాలు అందించిన శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇటీవల జయ జానకీ నాయక తర్వాత మెగా హీరో రాంచరణ్ తో తీసిన వినయ విధేయ రామ భారీ డిజాస్టర్ అయ్యింది.

రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఘోర వైఫల్యం చెందడానికి కారణం కేవలం దర్శకుడే అంటూ కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాలో హీరోయిజం చూపించే నేపథ్యంలో కాస్త ఎక్కువ డోస్ పెంచారని..అర్థం పర్థం లేని టైమింగ్ తో ఫైట్స్ ఉన్నాయని..సెంటిమెంట్ పెద్దగా కవర్ చేయలేదని టాక్ వినిపించింది. దాంతో సినిమా అంచనాలు తప్పడం అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. దాంతో బయ్యర్లను సుమారు 30 కోట్ల దాకా ముంచేసింది.

నష్టపరిహారం విషయం దానయ్యకు బోయపాటి శీనుకు మధ్య మాటల యుద్ధం జరిగిందని దిల్ రాజు లాంటి మధ్యవర్తులు వచ్చి చల్లబరిచారని కొద్దిరోజుల క్రితం గట్టి ప్రచారమే జరిగింది. బయ్యర్లకు రాంచరణ్, దానయ్య చెరో ఐదు కోట్లు ఇవ్వగా శీను ఫైనల్ గా కోటి దాకా ఇస్తానని ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం బోయపాటి ఇస్తానన్న కోటీ ఇవ్వడం లేదని టాలీవుడ్ టాక్. ఇక ఈ సినిమా నిర్మించడం దానికి విడుదల వ్యవహారాలు బిజినెస్ అన్ని నిర్మాత బాద్యతని ఒప్పుకున్న కథను చెప్పిన బడ్జెట్ లో తీసిచ్చినందుకు గాను తనకు రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి కోటి రూపాయలైనా ఎందుకు ఇవ్వాలని రివర్స్ అయినట్టు చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news