Gossipsనా పెళ్లాన్ని పో అంటావా... మ‌హేష్‌పై వ‌రుణ్ ఫైర్‌..

నా పెళ్లాన్ని పో అంటావా… మ‌హేష్‌పై వ‌రుణ్ ఫైర్‌..

బిగ్ బాస్ షోలో గురువారం నానా ర‌చ్చ జ‌రిగింది. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో హేమ‌, జాఫ‌ర్ ఎంపిక‌య్యారు. వీరు స‌క్సెస్ అవ్వ‌డంతో హౌస్‌కు ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ ద‌క్కింది. అయితే ఇచ్చిన టైంలో ఈ బ‌డ్జెట్‌కు స‌రిప‌డా స‌రుకులు తీసుకోవ‌డంలో కంటెస్టెంట్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. శ్రీముఖి టైంకి లేకపోవడమే అని హేమ అనడంతో ఫైర్ అయింది శ్రీముఖి. శ్రీముఖి తాను టైంకే వ‌చ్చాన‌ని… టీవీ రిమోట్ మ‌హేష్ ద‌గ్గ‌ర ఉంద‌ని… అత‌డు టీవీ ఆన్ చేయ‌క‌పోతే నేను ఏం చేస్తాన‌ని హేమ‌పై ఫైర్ అయ్యింది.

ఈ గొడ‌వ ఇలా ఉండ‌గానే మహేష్ విట్ట – వరుణ్ సందేశ్ మధ్య గొడవ మొదలైంది. వరుణ్ భార్య వితికా తనను మహేష్ విట్టా లోప‌ల‌కు పొమ్మ‌న్నాడ‌ని వితిక గ‌ట్టిగా అరిచింది. అప్ప‌టికే మూడు, నాలుగుసార్లు తాను అత‌డికి చెప్పాన‌ని అయినా అత‌డు గుమ్మం ద‌గ్గ‌ర చేయి అడ్డు పెట్టుకుని అలా అంటున్నాడ‌ని ఫైర్ అయ్యింది.

వెంట‌నే వ‌రుణ్ రంగంలోకి దిగి ”ఏయ్.. నా పెళ్లాన్ని పో అంటావా..? సిగ్గులేనోడా..?”అంటూ మహేష్ ని కొట్టేందుకు మీదకి వెళ్తూ ఆగ్రహంతో ఊగిపోయాడు. మహేష్ సమాధానం చెప్పడానికి ట్రై చేస్తుండగా.. వరుణ్ వినకపోవడంతో అతడు కూడా సీరియస్ అయిపోయాడు. వీళ్లిద్ద‌రు రారా అంటే రారా అని ఊగిపోయారు. ప‌క్క‌నే ఉన్న కంటెస్టెంట్లు అడుకునే ప్ర‌య‌త్నం చేశారు. వితికా సైతం మహేష్ పై ఫైర్ అయింది. వివాదం కంటిన్యూ అవుతుండగా.. ఎపిసోడ్ ముగిసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news