Gossipsబెల్లంకొండ బాబుకి ఇంత అవసరమా..!

బెల్లంకొండ బాబుకి ఇంత అవసరమా..!

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు హీరోగా మొదటి సినిమా నుండి నిన్న రిలీజ్ అయిన సాక్ష్యం వరకు బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వడం లేదు. అంతేకాదు హీరోయిన్స్ విషయంలో కూడా స్టార్స్ తో జతకడుతున్నాడు. అల్లుడు శీనులో సమంత హీరోయిన్ కాగా తమన్నాతో ఐటం సాంగ్ చేయించారు. ఇక స్పీడున్నోడు హీరోయిన్ కొత్త భామే అయినా అందులో కూడా తమన్నాతో ఐటం పెట్టారు. ఇక జయ జానకి నాయకా సినిమాలో రకుల్ తో రొమాన్స్ చేశాడు.

లేటెస్ట్ గా వచ్చిన సాక్ష్యం సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా చేసింది. క్రేజీ హీరోయిన్స్, భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రానా సినిమా హిట్ అవుతుందా.. కథ, కథనాల్లో దమ్ము లేకుంటే ఏమున్నా సినిమా హిట్ అవదు. మూడు ఫ్లాపులతో బెల్లంకొండ హీరో మార్కెట్ తెలిసినా సరే మళ్లీ సాక్ష్యం సినిమాకు 40 కోట్లు బడ్జెట్ పెట్టాడు నిర్మాత అభిషేక్ నామా. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అంతంతమాత్రంగానే సాగిందట.

మరి బెల్లంకొండ బాబు స్టార్ హీరో రేంజ్ లో బడ్జెట్ పెడుతుంటే రికవరీకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి బాబు ఇక నుండైనా బడ్జెట్ కంట్రోల్ చేసుకుంటే బెటర్ లేదంటే కష్టమే అని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news