Gossips'మెగా బ్రదర్స్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

‘మెగా బ్రదర్స్ పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ ఇండ్రస్ట్రీ లో మెగా బ్రదర్స్ చిరు తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. వారు సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చినా అభిమానులు రెట్టింపు అయ్యారు తప్ప తగ్గలేదు. అది ‘మెగా’ ఫ్యామిలీకి ఉన్న క్రేజ్. ఇక మెగా ఫ్యామిలీకి వీర భక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అందులో మొదటి పేరు బండ్ల గణేష్ అనే వినిపిస్తుంది.

టాలీవుడ్ లో కమెడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసి నిర్మాతగా ఎదిగిన గణేష్ రాజకీయాలలో కూడా సంచలనాలు సృష్టించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా చాల ప్రయత్నాలు చేసాడు. అయితే ఆయన ప్లాన్ మాత్రం వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇక లాభం లేదు అనుకున్నాడో ఏమో తెలియదు కాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా బ్రదర్స్ పవన్, చిరంజీవిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు.

సినిమాల నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అక్కడ కుళ్ళు కుతంత్రాలను తట్టుకోలేకపోయారని, కానీ నా దేవుడు పవన్ మాత్రం ఎటువంటి కుల్లునైనా తట్టుకుని భరిస్తాడనీ కామెంట్ చేసాడు. అంతేకాదు పరిస్తుతులను తట్టుకుని ఎదురీదడమే కాకుండా బరితెగించే విషయంలో పవన్ స్పీడ్ ముందు చిరంజీవి సరిపోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు బండ్ల గణేష్. అంతే కాదు పవన్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడు అంటూ బండ్ల నమ్మకంగా చెబుతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news