Moviesఎన్టీఆర్ కు 20 రోజులు టైం ఇచ్చిన బాలయ్య..!

ఎన్టీఆర్ కు 20 రోజులు టైం ఇచ్చిన బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. సినిమా ఓపెనింగ్ నాడే రిలీజ్ డేట్ చెప్పే సత్తా ఉన్న డైరక్టర్ పూరి జగన్నాధ్ పైసా వసూల్ ముహుర్తం నాడే సినిమాను సెప్టెంబర్ 29కి రిలీజ్ చేస్తామని ఎనౌన్స్ చేశాడు. ఇక దసరా బరిలో ముందునుండి తన సినిమా అంటూ హడావిడి చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.

బాబి డైరక్షన్ లో జై లవకుశగా సెప్టెంబర్ 21న వస్తున్నాడు. వారం తేడా ఉన్నా మరోసారి బాబాయ్ అబ్బాయ్ పోటీ అనుకున్నారు ఫ్యాన్స్ కాని అబ్బాయ్ కు 20 రోజులు టైం ఇచ్చి ఈలోగానే వచ్చేస్తున్నాడు బాలకృష్ణ. ముందు అనుకున్న డేట్ ను ప్రీ పోన్ చేసి సెప్టెంబర్ 1న బాలయ్య పైసా రిలీజ్ ఫిక్స్ చేశారు.

టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేశారు. అంతేకాదు బాలయ్య స్టైల్ కు ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. శ్రీయ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలాయ్య డాన్ గా కనిపిస్తారని తెలుస్తుంది. ఇక పూరి మార్క్ హీరోయిజంతో బాలయ్య అదరగొట్టేస్తాడని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news