Gossipsబాలయ్య - నాగ్  వివాదానికి కారణం అదేనా ..?

బాలయ్య – నాగ్  వివాదానికి కారణం అదేనా ..?

వృత్తిపరంగా పోటీపడినా, వ్యక్తిగతంగా మాత్రం ఎన్టీయార్‌, ఏఎన్నార్‌ చివరి వరకు స్నేహితులుగా మెలిగారు. వారి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం చాలా అరుదు. వారి వారసులు నాగార్జున, బాలకృష్ణ ఒకే సమయంలో టాప్‌ హీరోలుగా చెలామణి అయినా వారి మధ్య కూడా స్నేహం ఉంది. కారణాలేంటో తెలియదు కానీ, కొద్ది రోజులుగా నాగార్జున, బాలకృష్ణ మధ్య దూరం బాగా పెరిగిపోయింది . ఈ మాటలని ఇప్పటివరకు అందరూ పుకార్లుగానే కొట్టిపారేసినా చాలా సంఘ‌ట‌న‌ల త‌ర్వాత వాస్తవం అదే అని తేలిపోయింది.

కానీ టీఎస్సార్ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ వేదిక సాక్షిగా ప్రముఖ నటుడు నాగార్జున ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. తనకు బాలకృష్ణకు మధ్య విభేదాలు ఉన్నాయని ఎన్నో వార్తలు, పుకార్లు వచ్చాయని, అయితే, అవన్నీ వట్టిమాటలేనని నాగ్ స్పష్టం చేశారు. బాలయ్య బాబుకు తనకు ఎలాంటి గొడవల్లేవని.. ఇద్దరం సన్నిహితంగానే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. అయితే అదంతా వారి మధ్య ఏమి వివాదాలు లేవని నమ్మించడానికే తప్ప వాస్తవంగా వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది.

కొద్దీ కాలం క్రితం సుబ్బిరామిరెడ్డి ఏర్పాటు చేసిన ఓ వేడుక‌లో ఎన్టీఆర్ ఫొటో కూడా పెట్టలేద‌ట‌. అంతే కాదు.. త‌న‌ని ఆహ్వానించ‌డంలోనూ సుబ్బిరామిరెడ్డి నిర్లక్ష్యంగా ఉన్నార‌ని, ఆహ్వాన ప‌త్రంలో త‌న ఫొటో ప్రచురించ‌లేద‌ని బాల‌య్య అప్పట్లో  తీవ్ర అసహనం చెందాడంట. ఈ విష‌యంలో నాగ్ స‌ర్దిచెప్పబోతే, బాల‌య్య స‌రిగా స్పందించ‌లేద‌ట‌. దాంతో బాల‌య్య, నాగ్‌ల మ‌ధ్య అంతంరం పెరిగింద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకే ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య కనిపించలేదు సరికదా మొన్నీ మధ్య జరిగిన చైతూ సమంత వివాహానికి కూడా బాలయ్య హాజరవ్వలేదు. ఇక తాజాగా నాగ్ చైతు-స‌మంత రిసెప్ష‌న్‌కు బాల‌య్య‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించినా బాల‌య్య రాలేదు. దీనిని బ‌ట్టి వీరిద్ద‌రి మ‌ధ్య గ్యాప్ తీవ్ర‌స్థాయిలోనే ఉంద‌న్న గుస‌గుస‌లు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మ‌రింత ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news