Gossipsబాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్.. మధ్యలో ఎన్టీఆర్ ని ఎందుకు వద్దన్నారు?

బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్.. మధ్యలో ఎన్టీఆర్ ని ఎందుకు వద్దన్నారు?

యూత్ తో సమానం గ నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ సినిమాలు తీస్తున్నాడు.హిట్లు మీద హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్నాడు నందమూరి బాలకృష్ణ.ఇప్పటికే 101 సినిమాలు పూర్చి చేసుకొని ప్రస్తుతం 102 సినిమా షూటింగ్ లో వున్నారు నందమూరి బాలకృష్ణ.
నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాకు సీనియ‌ర్ ఎన్టీఆర్ హిట్ మూవీని ”కర్ణ” అనే పవర్ ఫుల్ టైటిల్ పెడుతున్నట్లు అప్పట్లో సోషల్ మీడియా లో మంచి దుమారం లేపింది.ఐతే ఎపుడు వచ్చిన సమాచారం ప్రకారం ”కర్ణ” టైటిల్ ని తీసేసి ‘జైసింహా’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు.

 

‘జయసింహ’ అనే టైటిల్‌తో గతంలో సీనియర్ ఎన్టీఆర్ 1955లో ఈ చిత్రం తో మంచి హిట్ కొట్టారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ అనే టైటిల్‌తో చిత్రం చేసి ‘జై’ పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా బాలయ్య 102వ చిత్రానికి ‘జైసింహా’ అనే టైటిల్ అనగానే ఆయన అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ టైటిల్‌ అని ప్రకటన చేయగానే మా హీరో మళ్లీ సింహమే అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 12 జనవరి 2018న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news