Newsభాగమతి తర్వాత అనుష్క.. గౌతం మీనన్ మూవీ అంచనాలకు మించి..!

భాగమతి తర్వాత అనుష్క.. గౌతం మీనన్ మూవీ అంచనాలకు మించి..!

బాహుబలి తర్వాత చాలా రోజులకు భాగమతిగా వచ్చి ప్రేక్షకులను అలరించింది అనుష్క. ఆ సినిమా బాహుబలి-2 కన్నా ముందు అనుకున్నదే అందుకే ఆ సినిమా ఒక్కటి పూర్తి చేసింది. అయితే సింగం-3 వచ్చినా లాభం లేకుండా పోయింది. అందుకే ఇక కమర్షియల్ సినిమాల కన్నా ఫీమేల్ లీడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తుందట అనుష్క. ఇక ప్రస్తుతం అమ్మడు కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ గౌతం మీనన్ కు ఓకే చెప్పిందని టాక్.

ఈ సినిమా కూడా అనుష్క లీడ్ రోల్ గా కనిపిస్తుందట. సినిమా కథ కొత్తగా ఉంటుందని అనుష్క ఇమేజ్ కు సరిపోయే సబ్జెక్ట్ అని అంటున్నారు. గౌతం మీనన్ ప్రత్యేక శ్రద్ధతో ఈ కథ రాసుకున్నాడట. భాగమతితో బౌన్స్ బ్యాక్ అయిన స్వీటీ అనుష్క ఈ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించడం ఖాయమని అంటున్నారు.

ఇక ఇదే కాకుండా మరో రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయట. మాక్సిమం కమర్షియల్ సినిమాల్లో అందాలతో అలరించేలా కాకుండా పాత్ర ప్రాధాన్యత ఉండేలా కథల ఎంపిక చేస్తుందట అనుష్క. చూస్తుంటే ఇక ఆమె ఫీమేల్ లీడ్ సినిమాలనే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news