Moviesఅడ‌వి శేష్ ' ఎవ‌రు ' ప్రి - రివ్యూ

అడ‌వి శేష్ ‘ ఎవ‌రు ‘ ప్రి – రివ్యూ

అడ‌వి శేష్ గూఢ‌చారి సినిమాతో టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు. తాజాగా అడివి శేష్ నటించిన మర్డర్ మిస్టరీ క్రైమ్ డ్రామా `ఎవరు`. రెజీన కథానాయిక. వెంకట్ రాంజీ దర్శకుడు. పీవీపీ నిర్మించారు. ఎవరు ప్రచార చిత్రాలకు అభిమానుల్లో స్పందన బావుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ చూస్తే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కింద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాకు శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తుండగా… వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సస్పెన్స్ రేకెత్తించే అంశాలతో పాటు సీరియస్ గా సాగే మర్డర్ కేసు గురించి చేసే విచారణ కూడా చాల బాగుంటుందని తెలుస్తోంది.

రెజీనా, అడవి శేష్ మరియు నవీన్ చంద్ర పాత్రల మధ్య సాగే డ్రామా కూడా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈనెల 15న శర్వా `రణరంగం` చిత్రంతో పోటీపడుతూ థియేటర్లలోకి వస్తోంది. నైజాం-ఏపీ సుమారు 7.7కోట్ల మేర బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మేర బిజినెస్ చేశారు. ప్రింట్లు పబ్లిసిటీ ఖర్చులు కాక ఇంత పెద్ద బిజినెస్ సాగింది. అంటే రూ.10 కోట్ల వ‌సూళ్లు రాబ‌డితే ఎవ‌రు బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నట్ల‌వుతుంది. మ‌రి అడ‌వి శేష్ ఏం చేస్తాడో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news