Newsఎన్టీఆర్,అల్లు అర్జున్ ల హీరోయిన్ ఇలా అయ్యిందేంటి.. చూస్తే షాకవ్వాల్సిందే!

ఎన్టీఆర్,అల్లు అర్జున్ ల హీరోయిన్ ఇలా అయ్యిందేంటి.. చూస్తే షాకవ్వాల్సిందే!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన పరుగు సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో హీరోయిన్‌ షీలా చాలా హోమ్లీగా కనిపిస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. అయితే అమ్మడికి టాలీవుడ్ అంతగా అచ్చిరాలేదు. పరుగు సినిమా తరువాత ఎన్టీఆర్ తో కలిసి అదుర్స్ సినిమాలో గ్లామర్ డోస్ పెంచి చిందేసింది. తరువాత అడపా దడపా కొన్ని సినిమాలు చేసినా.. వాటిని జనాలు మరిచిపోయారు. ఇక ఆ తరువాత తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు వెళ్లి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో అమ్మడు సినిమాలు చేయడం మానేసింది. దీంతో అసలు షీలా అనే హీరోయిన్ అంటే ఎవరు.. అని అడుగుతున్నారు ప్రెజెంట్ ఫ్యాన్స్.

అయితే షీలా అనే తాను ఇంకా ఉన్నానంటూ బయటకొచ్చింది ఈ బ్యూటీ. కానీ.. ఆమెను చూసి ఖంగుతిన్నారు అందరు. ఈ అమ్మడు అప్పట్లో అందంగా, కాస్త బొద్దుగా ఉన్న విషయం విదితమే. కానీ తాజాగా షీలా అవతారం చూస్తే.. ఆమెకు ఏమయ్యిందో అనే ప్రశ్న మన మదిలో రాక మానదు. మరి అంతలా షీలా మారిపోవడానికి కారణం ఏమిటి.. అని ఆమెనే అడిగారు మీడియా వారు. ‘‘నేను సినిమాల కోసం ఇలా మారాను’’ అంటూ బదులిచ్చింది ఈ భామ. కానీ సినీ ఇండస్ట్రీలో ఫేం ఉన్నంతవరకే హీరోయిన్లను గుర్తుకుపెట్టుకుంటున్నారు జనం. అలాంటిది.. సినిమాలు లేక ఇలా తయారయిన వారు మాత్రం చాలానే ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ బ్యూటీకీ కోరుకున్న సినిమా ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news