Moviesఆ బ్లాక్ బస్టర్ సినిమాను మళ్లి తెర పైకు తీసుకువస్తున్న నాగార్జున..ఎందుకంటే..?

ఆ బ్లాక్ బస్టర్ సినిమాను మళ్లి తెర పైకు తీసుకువస్తున్న నాగార్జున..ఎందుకంటే..?

సినీ ఇండస్ట్రీలో ఏదైన ఓ సినిమా సూపర్‌ హిట్‌ అయితే ఇతర భాషలో రీమేక్‌ అవ్వడం సర్వసాధారణం. ఇప్పటికే అలా ఎన్నో సినిమాలను ఎన్నో బాషల్లో రీమేక్ చేసారు. ఒక మంచి సినిమా ను ఒక భాష నుండి మరో భాష కి సంభందించిన ఆడియన్స్ కి అందించాలి కాబట్టి రీమేక్స్ విషయం లో ఎలాంటి తప్పు లేదు కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ విస్తారంగా వ్యాప్తి చెంది ఉన్న టైం లో అందరూ అన్ని భాషల సినిమాలను సబ్ టైటిల్స్ తో చూసేస్తూ సినిమా కి భాషతో సంభందం లేదు అని నిరూపిస్తున్న వేల ఇంకా రీమేక్లు చేయడం చాలా కష్టతరం అనే చెప్పాలి.

అయితే ఇండస్ట్రీలో రీమేక్‌ల హవా నడుస్తోన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో.. మలయాళ సినిమాల పై మోజు పెరిగిన్నట్లుంది. అందుకే కాబోలు స్టార్ హీరోలు సైతం మాలీవుడ్ రీమేక్స్‌లో నటించడానికి రెడీ అయిపోతున్నారు. చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ ‘గాడ్‌ఫాదర్‌‌’ లో నటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ రీమేక్‌ ‘భీమ్లానాయక్‌’లో యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి నాగార్జున చేరిపోయారు.

యస్.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్కినేని అందగాడు నాగార్జున ఓ మలయాళ మూవీ రీమేక్‌లో నటించబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. మళయాళం లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ అనే సినిమా నాగ్‌కి తెగ నచ్చేసిందట. అందుకే రీమేక్ అంటే ఇష్టం లేని..నాగార్జున కూడా ఈ సినిమా పై మోజు పడ్డట్లు తెలుస్తుంది. ‘ద గ్రేట్ ఇండియన్‌ కిచెన్‌’ని జియో బేబి డైరెక్ట్ చేశారు. పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో కాపురానికి వచ్చిన అమ్మాయికి ఎదురయ్యే సమస్యల చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. అందుకే ఈ మూవీని నాగార్జున ఖచ్చితంగా రీమేక్ చేయాలి అని డిసైడ్ అయ్యారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news