Gossipsమళ్లీ అడ్డంగా బుక్ అయిన ప్రియాంక చోప్రా..!

మళ్లీ అడ్డంగా బుక్ అయిన ప్రియాంక చోప్రా..!

బాలీవుడ్ హాట్ బ్యూటీ గ్లోబల్ యక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రియాంకా చోప్రో సోషల్ మీడియాలో మరోసారి అడ్డంగా బుక్ అయ్యింది. సాధారణంగా తెలుగు సామెత ‘కోడలికి బుద్ది చెప్పి అత్త అదేదో చేసిందట’..బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా తీరు. ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం.. దీపావళిని దీపాలతో జరుపుకోవాలి కానీ.. పటాసులు కాల్చి కాలుష్యానికి కారణం కావద్దు’ అంటూ నీతులు చెప్పిన ఈ బాలీవుడ్‌ బామ ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఫ్లొరిడాలోని మయామిలో ప్రియానిక్‌ జోడి సేద తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

జులై 18న జన్మదినం జరుపుకున్న ప్రియాంక భర్త నిక్‌ జోనస్‌తో కలిసి పుట్టిన రోజు సంబరాలను ఘనంగా జరుపుకుంటుంది.తాజాగా ఈ ముగ్గురు కలిసి ధూమాపానం చేస్తున్న ఓ ఫొటో నెట్టింట హల్‌చేస్తోంది. ఈ ఫొటోలో ప్రియాంక చోప్రా సిగరేట్‌ను ఆస్వాదిస్తుంది. ‘అప్పుడు ఏం చెప్పి.. ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి’ అంటూ సెటైరిక్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఐదేళ్లప్పుడు తాను ఆస్తమ వ్యాధితో బాధపడ్డానని, ఆ వ్యాధి తన కలలకు అడ్డుగా నిలవలేదని ఆస్తమ వ్యాధిగ్రస్తులను చైతన్య పరిచే వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ప్రియాంక ఫోటో చూసి ఇలాంటి అబద్దపు మాటలతో ఎవరిని మోసం చేస్తావు అంటూ నెటిజన్లు ఘాటుగానే విమర్శిస్తున్నారు.
Priyanka-Chopra

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news