టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ కుబేర. బాక్సాఫీస్ దగ్గర సాలీడ్ హిట్ సినిమాగా నిలిచిన కుబేర సినిమాలో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్లో నటించారు. ఇక శేఖర్ కమ్ముల మార్క్ టేకింగ్తో పాటు ఎమోషనల్ కంటెంట్కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి.కుబేర సినిమా రిలీజ్ అయి రెండో వారంలోకి అడుగుపెట్టింది. రెండో ఆదివారం కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటింది. కుబేర రెండో ఆదివారం నాడు బుక్ మై షోలో ఏకంగా 67 వేలకు పైగా టికెట్లు బుక్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తోంది.
రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇక కుబేర సినిమాకు ఫుల్ బాక్సాఫీస్ రన్లో మరిన్ని వసూళ్లు రానున్నాయి.
రెండో ఆదివారం కూడా ‘ కుబేర ‘ డామినేషన్ మామూలుగా లేదే…!
