టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో వెయిట్ చూస్తున్నారో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్.. ఏఎం. జ్యోతికృష్ణ సంయుక్తంగా డైరెక్ట్ చేయగా.. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై సీనియర్ నిర్మాత ఏఎం. రత్నం నిర్మించారు. నాలుగేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని లేట్ అయినా కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాదాపు రు. 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం తిప్పలు ఇంకా తప్పడం లేదు.ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా సార్లు వాయిదాలు పడుతూ వస్తోంది. ఈ నెల 12న రిలీజ్ అన్నారు.. మరోసారి వాయిదా పడింది. ఇక ఈ సినిమా పూర్తవ్వకముందే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడడంతో ఇప్పుడు ముందుగా ఓకే అయిన ఓటీటీ డీల్ను మార్చేందుకు ఓటీటీ పార్ట్నర్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
ముందుగా రూ.75 కోట్ల మేర ఓటీటీ డీల్ కుదిరిందని.. అయితే, రిలీజ్ డేట్ వాయిదా పడటంతో రూ.65 కోట్లకు తగ్గించారట. ఇప్పుడు మళ్లీ వాయిదా పడడంతో మరో రు. 5 కోట్లు తగ్గించాలని ఓటీటీ పార్ట్నర్స్ పట్టుబడుతున్నట్టు టాక్ ? ఇందుకు నిర్మాత సేసేమీరా అనడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా కొలిక్కి రావడం లేదట.
పవన్ వీరమల్లు సినిమాకు తప్పని తిప్పలు… హరిహరా… ?
