టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇపుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ పరంగా అటు వెండితెరను.. ఇటు బుల్లితెరను షేక్ చేసి పడేస్తున్నారు. వెండితెరపై నాలుగు వరుస సూపర్ డూపర్ హిట్లతో దూసుకుపోతున్నారు. ఈ సంక్రాంతికి డాకూ మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు అఖండ లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.రీసెంట్గా బాలయ్యకు పద్మభూషణ్ గౌరవం రావడం నందమూరి అభిమానులకి ఎంతో గర్వకారణంగా. అయితే ఈ శుభ సందర్భాన్ని గ్రాండ్ గా బాలయ్య అభిమానులు జరుపుకున్నారు. వేలమంది అభిమానుల సమక్షంలో బాలయ్య అడ్డా హిందూపూర్ నియోజకవర్గంలో తనకి ఘనంగా సన్మాన సభ జరుపుకున్నారు. దీంతో అక్కడ బాలయ్య సతీసమేతంగా హాజరు కాగా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
కంచుకోటలో బాలయ్యకు నీరాజనం…!
