పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు హీరో గానే కాకుండా ఇటు రాజకీయంగా కూడా రాణిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం గా కూడా తనదైన శైలిలో పని చేసుకుంటూ వెళుతున్నారు. పవన్ కళ్యాణ్కు ముందు నుంచి సామాజిక స్పృహ ఎక్కువ. ఇటీవల పహల్గం ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన పట్ల పవన్ చాలా చింతించారు. ఈ క్రమంలోనే పవన్ చేసిన కామెంట్లు లోకల్ నుంచి నేషనల్ వైడ్ గా కూడా ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి.ప్రస్తుతం నెలకొన్న విషాద పరిస్థితిలలో ఎవరైనా సంఘవిద్రోహులు కానీ సోషల్ మీడియాలో దేశం పట్ల తప్పుగా మాట్లాడినా లేదా పోస్టులు పెట్టినా వారికి జైలే గతి అని గట్టి వార్నింగ్ ఇచ్చి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దీనితో తన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఇక కొన్ని రోజుల్లో పవన్ తన సినిమాల షూటింగ్లలో పాల్గొననున్నాడు. ముందుగా హరిహర వీరమల్లు ఆ తర్వాత ఓజీ లకు డేట్లు ఇస్తారు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తన వీలును బట్టి ఉస్తాద్ భగత్సింగ్ సినిమాకు డేట్లు ఇవ్వనున్నారు.
వాళ్లకు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ..!
