నందమూరి హీరో బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్యకు సోదరి అయిన నారా భువనేశ్వరి హైదరాబాద్లో శనివారం రాత్రి ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి – నారా కుటుంబాలకు చెందిన వారితో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాలయ్యకు బావ అయిన నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
అలాగే బాలయ్యతో ఇటీవల కాలంలో వరుసగా హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శక.. నిర్మాతలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు బాలకృష్ణతో తన అనుబంధాన్ని పంచుకుంటూ క్రేజీ కామెంట్ చేయగా.. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చంద్రబాబు ఏం మాట్లాడారు అంటే ఒక పక్కన బాలయ్య .. మరో పక్కన అంతే పవర్ ఫుల్ గా భువనేశ్వరి ఇద్దరి మధ్య ఇప్పుడు తాను నలిగిపోతున్న అని నవ్వుతూ మాట్లాడటం ఆకట్టుకుంది.
బాబు ఇంకా మాట్లాడుతూ వీరిద్దరి మధ్య ఉంటే చాలా ప్రమాదం.. నిన్నటి వరకు అల్లరి బాలయ్యా కాస్తా ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య అయిపోయారు.. దేశం గర్వించదగ్గ బిడ్డ అయ్యారు. మా కుటుంబంలో ఇలాంటి అవార్డు రావడం.. ఇదే తొలిసారి కుటుంబ సభ్యులు అందరం ఎంతో గర్వపడుతున్నాం నాకు ఒక అద్భుతమైన బావమరిది బాలయ్య రూపంలో దొరకటం అదృష్టంగా భావిస్తున్న అని చంద్రబాబు చెప్పుకు వచ్చారు.