సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సంక్రాంతికి మూడు మంచి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ – నందమూరి బాలకృష్ణ డాడూ మహారాజ్ – విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి.
జనవరి 10న రాంచరణ్ సినిమా – 12న బాలయ్య సినిమా – 14న వెంకీ సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలుకు కూడా టికెట్ రేట్ల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే సినిమా టికెట్ రేట్ ల పెంపు ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఏపీలో ఈ మూడు సినిమాలు కొత్త రేట్లు భారీగా పెరగనున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రు. 135 .. మల్టీప్లెక్స్ లలో రు. 175 మేర టికెట్లు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఈ సినిమాకు బెనిఫిట్ షో టికెట్ రేట్లు 600 వరకు ఉండబోతున్నాయి. ఇక బాలయ్య సినిమాకు సింగల్ స్క్రీన్స్ లో 110 .. మల్టీప్లెక్స్ లలో 135 పెంపునకు అనుమతి ఇచ్చారు.
ఈ సినిమా బెనిఫిట్ షో కు రు. 500 మేర అనుమతి ఇచ్చారు .సంక్రాంతి వస్తున్నాంకు సింగల్ స్క్రీన్స్ లో 75 .. మల్టీప్లెక్స్ లలో 100 రూపాయలు పెంపు ఉంటుంది. మరి ఈ మూడు సినిమాలు సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందుకుని బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు క్రియేట్ చేస్తాయో చూడాలి.