టాలీవుడ్లో తెరకెక్కుతున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ SSMB 29. మహేష్బాబు – రాజమౌళి సినిమా అంటేనే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తితో కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమాతో
సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రపంచ స్థాయి హీరోగా మార్చాలని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ఇప్పటిన ఉంచే ప్రణాళికలు రచిస్తున్నారు.
ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటీమణి.. స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రియాంక ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుంది.. ఆమె చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు కూడా చేశారు. ఈ సినిమా కోసం ప్రియాంక భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
వరల్డ్ గ్రాండియర్ మూవీ గా రాబోతున్న SSMB29 లో నటించేందుకు ప్రియాంక ఏకంగా రూ.20 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ స్థాయిలోనే ప్రియాంక చోప్రాకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆమెకు ఇంత మొత్తంలో భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది.