Moviesఈ ముగ్గురి స్టార్స్ తో ఇప్పటివరకు రాజమౌళి .. ఒక్క సినిమాను...

ఈ ముగ్గురి స్టార్స్ తో ఇప్పటివరకు రాజమౌళి .. ఒక్క సినిమాను తెరకెక్కించకపోవడానికి కారణం ఆ హీరో నేనా..?

రాజమౌళి ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ . అప్పటివరకు తెలుగు సినిమాలు అంటే బాగుంటాయి.. చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పాటలు కూడా మంచిగా చిత్రీకరిస్తారు.. అంతవరకే తెలుసు కానీ తెలుగు సినిమాలు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంటాయి అని ప్రూవ్ చేసింది మాత్రం రాజమౌళి అని చెప్పక తప్పదు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచ దేశాలకు పాకేలా చేశాడు రాజమౌళి.

అభిమానులు ముద్దుగా జక్కన్న అంటూ పిలుచుకునే ఈ డైరెక్టర్ ప్రెసెంట్ మహేష్ బాబు తో భారీ అడ్వెంచర్స్ మూవీను తెరకెక్కించబోతున్నాడు. రాజమౌళితో సినిమా అంటే ఎన్ని తిప్పలు ఉంటాయో ఆయనతో వర్క్ చేసిన వాళ్లకే తెలుస్తుంది . మరి ముఖ్యంగా తారక్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . అయితే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు ఇండస్ట్రీలో ఉండే అందరి స్టార్ హీరోలతోనూ వర్క్ చేసిన రాజమౌళి ఈ ముగ్గురు హీరోలతో మాత్రం వర్క్ చేయలేకపోయాడు .

అయితే ఈ ముగ్గురు హీరోలు అంటే ఆయనకి మరీ మరీ అభిమానం కావడం గమనార్హం . ఆ ముగ్గురు మరెవరో కాదు పవన్ కళ్యాణ్ – బాలయ్య – . బన్నీ ముగ్గురికి ముగ్గురే తోపైన హీరోలు. స్టార్ స్టేటస్ కలిగిన హీరోలు .గతంలో చాలా సార్లు వీళ్లతో సినిమా తెరకెక్కించే ఛాన్స్ వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే రాజమౌళితో సినిమా అని తెలిసినా కూడా ఈ హీరోల రిజెక్ట్ చేయడం వాళ్ళ బాడీకి సూట్ కాదు అంటూ ఆ కథలను రిజెక్ట్ చేశారట.

విక్రమార్కుడు సినిమాను ముందుగా పవన్ కళ్యాణ్ కోసమే రాసుకున్నాడు ..ఆ సినిమా రవితేజ కు వెళ్లిపోయింది. సింహాద్రి సినిమాను బాలయ్య బాబు కోసం రాసుకున్నారు ఆ సినిమా ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. యమదొంగ సినిమా కథను బన్నీ కోసం రాసుకున్నారట .ఆ సినిమా ఎన్టీఆర్ ఖాతాలోకి వెళ్లిపోయింది . ఇలా ఈ ముగ్గురితో వర్క్ చేసే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు రాజమౌళి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news