Movies"అసలు నీకు బుద్ధుందా రా సుకుమార్ ..?" కోపంతో ఊగిపోయిన దిల్...

“అసలు నీకు బుద్ధుందా రా సుకుమార్ ..?” కోపంతో ఊగిపోయిన దిల్ రాజు..ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు . వాళ్ళల్లో ఒకరే దిల్ రాజు – సుకుమార్ . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ప్రొడ్యూసర్ గా పాపులారిటీ సంపాదించుకున్న దిల్ రాజు మంచి జాన్ జిగిడి దోస్తులు . వీళ్ళ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ క్రమంలోనే గతంలో దిల్ రాజు సుకుమార్ ని తిట్టిన మాటలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి .

మనకు తెలిసిందే.. సుకుమార్ ఒక లెక్చరర్ . సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ ఇటువైపుగా వచ్చాడు . 2004లో లెక్చరర్ గా గుడ్ బాయ్ చెప్పేసి డైరెక్టర్ గా మారిపోయాడు . ఆర్య సినిమాతో సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సుకుమార్ తానే గొప్ప అనుకునే వాడు. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకోవడంతో ఇండస్ట్రీ అంటే ఇలానే ఉంటుంది అంటూ ఒక అంచనా వేసేసాడు . అంతేకాదు ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన కెరియర్ కి డిజాస్టర్ గా మారాయి.

సుకుమార్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నిలిచిన మూవీ జగడం . అసలు ఎందుకు తెరకెక్కించాడో ఆయనకైనా తెలుసో లేదో అంటూ అప్పట్లో ఫ్యాన్స్ ట్రోల్ చేశారు . నిజానికి ఈ సినిమా కథను మహేష్ బాబు లేదా అల్లు అర్జున్ లతో తెరకెక్కించాలనుకున్నారట. కానీ కాన్సెప్ట్ కొంచెం చేంజ్ చేయాలి అంటూ హీరోలు చెప్పుకొచ్చారట. అయితే ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాల్సి ఉండింది . ఆయన రాసుకున్న కాన్సెప్ట్ చేంజ్ చేయడం ఇష్టం లేని సుకుమార్ దిల్ రాజుతో చెప్పకుండా రాత్రికి రాత్రి రామ్ పోతినేనితో సినిమాకి కమిట్ అయ్యాడు.

ఉదయాన్నే షూటింగ్ మొదలు పెట్టేసాడు . ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజు..” అసలు నీకు బుద్ధుందా రా సుకుమార్ అంటూ ఓ రేంజ్ లో అరిచేసాడట .నీకు ఏదైనా నచ్చకపోతే చెప్పాలి కానీ ఇలాంటి డెసిషన్ తీసుకుంటావా ..? ఈ సినిమా కొంచెం కాన్సెప్ట్ మార్చి ఉంటే ఎంత పెద్ద హిట్ అయి ఉండేదో తెలుసా ..?” అంటూ బాగా చివాట్లు పెట్టారట . ఆ తర్వాత సుకుమార్ చేసిన తప్పుని ఆయన తెలుసుకొని ఎవరైనా సజెషన్స్ ఇస్తే ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు . ఈరోజు పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news