సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. కారణాలు ఇది అని ప్రత్యేకంగా చెప్పలేము కానీ .. కొన్నిసార్లు ఆ సినిమాలు తెరపై చూడడానికి అదృష్టం లేదు అనుకోని సరి పెట్టుకోవాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణవంశీ తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఇండస్ట్రీకి అందించాడు. ఎన్నో అవార్డులను కూడా తీసుకొచ్చారు .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2024/02/maxresdefault-2-4-1024x576.jpg)
కాగా కృష్ణవంశీ – వెంకటేష్ కాంబోలో ఓ బడా సినిమా రావాల్సి ఉంది అని ..కానీ ఆ సినిమా మిస్ అయింది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సినిమా మరేదో కాదు జగపతిబాబు – ప్రకాష్ రాజ్ – సౌందర్య కాంబోలో వచ్చిన అంతః పురం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా వెంకటేష్ అనుకున్నారట డైరెక్టర్ .
![](https://www.telugulives.com/telugu/wp-content/uploads/2023/11/1330394-venkatesh-daggubati-victory.webp)
కానీ అప్పటికే ఆయన పరిశ్రమలలో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు వేరే హీరో చేతిలోకి వెళ్లిపోయింది . ఆ తర్వాత ఈ సినిమా హిట్ అవ్వడంతో చాలా చాలా బాధపడ్డాడట వెంకటేష్ . దురదృష్టం అంటే ఇదేనేమో ఇంకేం చేస్తాం అంటున్నారు జనాలు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్ టైం అసలు బాగోలేదు .. ఆయన ఏ సినిమా చేసిన డిజాస్టర్ అవుతుంది . అసలు వెంకటేష్ హిట్ కొట్టి ఎంత కాలం అవుతుందో.. రీసెంట్ గా వచ్చిన సైంధవ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు వెంకటేష్ . కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అంతేకాదు పరమ చెత్త నెగిటివ్ టాక్ ని కూడా క్రియేట్ చేసుకుంది
.