Moviesమహేష్ బాబు అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన నమ్రత.. ఇక...

మహేష్ బాబు అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన నమ్రత.. ఇక ఫాన్స్ కు పూనకలే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు రీసెంట్ గా నటించిన సినిమా గుంటూరు కారం . ఈ సినిమా అభిమానులను డిసప్పాయింట్ చేసింది. సినిమాలో మహేష్ బాబు రేంజ్ కి తగ్గ స్టామినా లేదు అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు . కలెక్షన్స్ పరంగా మాత్రం గుంటూరు కారం సినిమా కుమ్మి పడేసింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కోట్లు క్రాస్ చేసి మహేష్ బాబు స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది .

అయితే ప్రెసెంట్ మహేష్ బాబు కొన్ని పనులు కారణంగా జర్మనీ వెళ్లిపోయారు . రీసెంట్ గా నమ్రత తన బర్త్డ డే సందర్భంగా అభిమానులతో లైవ్ సెషన్ లో పాల్గొనింది . ఈ క్రమంలోనే హీరోయిన్గా సితార ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అన్న ప్రశ్న వేశారు నెటిజన్స్. ఆమెను వెండితెర పై చూడటానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో నమ్రత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. సితార కి కూడా వెండి తెర అంటే చాలా ఇష్టం అని .. మీరు కచ్చితంగా ఆమెను వెండి తెరపై చూస్తారు అంటూ కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇచ్చింది. దీంతో త్వరలోనే సితార ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. త్వరలోనే మహేశ్ బాబు-రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news