Newsఓరి దేవుడోయ్ ..ఏం ట్విస్ట్ ఇచ్చావు రా బిగ్ బాస్..ఫినాలే ...

ఓరి దేవుడోయ్ ..ఏం ట్విస్ట్ ఇచ్చావు రా బిగ్ బాస్..ఫినాలే వారం ముందే విన్నర్ డిసైడ్.. షో చరిత్రలో ఇదే తొలిసారి..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ కి సంబంధించిన వార్తలే వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది తెలుగు బుల్లితెరపై రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ సంచలనంగా మారిన ఏకైక రియాలిటి షో బిగ్ బాస్ సరికొత్త కంటెంట్ తో ప్రసారం అవుతున్నప్పటికీ జనాలలో కొన్ని డౌట్లు నెగెటివిటీ ఉంది . అయినా సరే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తిచేసుకుంది.

త్వరలోనే ఏడవ సీజన్ ని కూడా పూర్తి చేసుకోబోతుంది. కాగా తాజాగా ఓటింగ్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు బిగ్ బాస్. దీంతో లెక్కలన్నీ తారుమారు అయిపోయాయి . బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ వచ్చే కొద్ది మరింత రసవత్తరంగా మారిపోతుంది. ఉల్టా పల్టా కాన్సెప్ట్ ను కరెక్ట్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు బిగ్ బాస్ . ఆయన ఎవరినైతే ట్రోఫీ విన్నర్ చేయాలి అనుకుంటున్నాడో వాళ్ళని ట్రోఫీ విన్నర్ చేసే విధంగా పావులు ముందుకు కదుపుతున్నాడు.

ఉన్న కంటెస్టెంట్ల లల్లో టాప్ ఫైవ్ ఎవరు అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తి రసవత్తరంగా సాగింది .పోటాపోటీ మాటలు అరుపులు – కేకలు మధ్య ఫైనల్ అస్త్ర ద్వారా ఇప్పటికే ఫినాలే చేరుకున్న అంబాటి అర్జున్ తప్పిస్తే మిగతా అందరూ నామినేట్ అయిపోయారు . బిగ్ బాస్ షో లో ఫైనల్ విన్నర్ ను డిసైడ్ చేసే ఓటింగ్ సీజన్ చివరి వారంలో మాత్రమే జరుగుతుంది .

అయితే ఇండియాలోని ఏ భాషలో అయినా ఇదే పద్ధతి కొనసాగిస్తూ వచ్చారు బిగ్బాస్ మేనేజ్మెంట్ . ఏడో సీజన్లో మాత్రం ఒక వారం ముందు నుంచి ఫినాలే ఓటింగ్ను ప్రారంభించారు బిగ్బాస్ యాజమాన్యం . ఈ రెండు వారాలలో ఎవరు ఎక్కువ ఓట్లు వేస్తే వాళ్లే విజేతగా నిలవబోతున్నారు అంటూ ప్రకటించారు .దీంతో అర్జున్ ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి .
దీంతో ఎవరైతే తమ కంటెస్టెంట్ ని గెలిపించాలి అనుకుంటున్నారో ఈ రెండు వారాలు బాగా కష్టపడాల్సి ఉంటుంది . కాగా అందుతున్న సమాచారం ప్రకారం శివాజీ ట్రోఫీ విన్నర్ గా ప్రశాంత్ పల్లవి ను రన్నర్ గా నిలవబోతున్నారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news