Newsఆ స్టార్ హీరోకు రు. 150 కోట్ల రెమ్యున‌రేష‌న్‌తో మైత్రీ సంచ‌ల‌నం......

ఆ స్టార్ హీరోకు రు. 150 కోట్ల రెమ్యున‌రేష‌న్‌తో మైత్రీ సంచ‌ల‌నం… డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌…!

టాలీవుడ్‌లో ఇప్పుడు మైత్రీ మూవీ మేక‌ర్స్ వ‌రుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులు సెట్ చేస్తూ భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో పెద్ద పెద్ద నిర్మాత‌లు, బడా బ‌డా నిర్మాత‌ల‌కే పెద్ద పెద్ద స‌వాళ్లు రువ్వుతోంది. ఈ యేడాది సంక్రాంతికి ఒకేసారి ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌య్య‌తో వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు ప్రెస్టేజియ‌స్ ప్రాజెక్టులు నిర్మించి రెండు సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్ట‌డంతో పాటు రెండు సినిమాలు చాలా ఏరియాల్లో ఓన్‌గా పంపిణీ చేసుకుని స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఇప్పుడు మైత్రీ మూవీస్ త‌మిళ స్టార్ హీరో అజిత్‌తో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. అజిత్ డేట్లు బ్లాక్ చేసేందుకు ఏకంగా రు. 150 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసిన‌ట్టుగా స‌మాచారం. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడిగా అధిక్ ర‌విచంద్ర‌న్‌ను తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. అధిక్ ఎవ‌రో కాదు ఇటీవ‌ల విశాల్‌తో మార్క్ ఆంటోనీ సినిమా తీసి సూప‌ర్ హిట్ కొట్టాడు.

తాజాగా ప్ర‌భు కుమార్తె ఐశ్వ‌ర్య‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టుగా కూడా వార్త‌ల్లోకి వ‌చ్చాడు. మార్క్ ఆంటోనీ ర‌విచంద్ర‌న్‌కు మూడో సినిమా. ఇప్పుడు అజిత్‌తో చేసేది నాలుగో సినిమా. తెలుగు హీరోలు రెండేళ్ల‌కు ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. దీంతో మైత్రీ వాళ్లు అజిత్‌పై వ‌ల వేసిన‌ట్టుగా తెలుస్తోంది.

అజిత్ ఇప్ప‌టి వ‌ర‌కు రు. 100 – 110 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మైత్రీ వాళ్లు రు. 150 కోట్ల‌తో అజిత్ డేట్లు బ్లాక్ చేయ‌డం అంటే అది సంచ‌ల‌న‌మే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news