Newsమెగాస్టార్ కోసం ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య ఇంత ర‌చ్చ జ‌రుగుతోందా...!

మెగాస్టార్ కోసం ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య ఇంత ర‌చ్చ జ‌రుగుతోందా…!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు విశ్వంభ‌ర అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. సినిమాలో ఇద్ద‌రు, ముగ్గురు హీరోయిన్లు ఉంటార‌ని.. మెయిన్ హీరోయిన్ కోసం ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ అన్వేష‌ణ కొన‌సాగిస్తున్న‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

మెయిన్ హీరోయిన్‌గా చిరు ప‌క్క‌న సీనియ‌ర్ హీరోయిన్ అయితేనే క‌రెక్టుగా సెట్ అవుతుంద‌ని అంటున్నారు. అందుకే త్రిష‌తో పాటు అనుష్క పేర్లు ప‌రిశీలిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు హీరోయిన్లు కూడా గ‌తంలో చిరు ప‌క్క‌న న‌టించారు. త్రిష స్టాలిన్ సినిమాలో న‌టించ‌గా.. అనుష్క అదే సినిమాలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. ఆ సాంగ్‌లో చిరుతో క‌లిసి స్టెప్పులు వేసింది.

ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్‌తో పాటు మేక‌ర్స్ త్రిష లేదా అనుష్క‌లో ఎవ‌రిని ఫైన‌లైజ్ చేయాలా అని బాగా తిక‌మ‌క ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. చిరు అభిమానులు మాత్రం ఎక్కువుగా త్రిష ఇప్ప‌ట‌కీ మంచి ఫామ్‌లో ఉంద‌ని… పైగా ఇటీవ‌ల విజ‌య్ లియో సినిమాతో ఆమె సూప‌ర్ హిట్ కొట్టింద‌ని.. ఆమెనే హీరోయిన్గా తీసుకోవాల‌ని అంటున్నారు. దీనిపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రుగుతోంది.

ఈ భారీ బ‌డ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా… యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. రు. 200 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. రెండు పార్టులుగా ఈ సినిమా నిర్మాణం కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news