Newsఅల్లుళ్ళకు తీవ్ర అన్యాయం చేస్తోన్న మెగాస్టార్‌...

అల్లుళ్ళకు తీవ్ర అన్యాయం చేస్తోన్న మెగాస్టార్‌…

సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ఓ మహా వృక్షం. ఆయన పేరు చెప్పుకొని ఫ్యామిలీ నుంచి ఎంత మంది వచ్చారో అందరికీ తెలిసిందే. నాగబాబు, పవన్ కళ్యాణ్, రా చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక..ఇలా మెగా ఫ్యామిలీలో చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇక ఆ ఇంట్లో పెరిగిన రానా, శర్వానంద్ లాంటి వారికి చిరు సపోర్ట్ బాగానే ఉంది.

అయితే, ఒక సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన సొంత నిర్ణయాలతో కథలను ఎంచుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఆ తర్వాత హీరోలందరు చేయాల్సిన కథలను ముగ్గురు మెగా బ్రదస్ విన్న తర్వాత కథ చేసే హీరో విన్న తర్వాత దర్శకనిర్మాతలకి ఒకే చెబుతున్నారు. ఒకవెళ చిరంజీవికి గనక కథ నచ్చకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టే మెగా హీరోలు ఇండస్ట్రీలో నిలబడగలుగుతున్నారు.

అయితే, ఈ మధ్యకాలంలో మెగా అల్లుళ్ళు నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ ని సాధించలేకపోతున్నాయి. ఈ మధ్య మెగాస్టార్ తనకథల విషయంలోనే సరిగ్గా జడ్జ్ చేసుకోలేకపోతున్నారు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందుకే, ఆయనకి ఫ్లాప్స్ ఎక్కువగా వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి మెగాస్టార్ ఇక తన అల్లుళ్ళ విషయంలో పట్టంచుకుంటారా..? అని. పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరం తేజ్ తో కలిసి బ్రో సినిమా చేశారు. ఈ సినిమా ఫ్లాపైనా కూడా మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

అయితే, కనీసం పవన్ కళ్యాణ్ అయినా తన అల్లుళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు గానీ, చిరంజీవి మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదని ఫాన్సే చెప్పుకుంటున్నారు. కాబట్టే వైష్ణవ్ తేకి ఉప్పెన తర్వాత అన్నీ ఫ్లాపులే వస్తున్నాయని, ఇలా అయితే, ఈ మెగా మేనల్లుడు కెరీర్ క్లోజ్ అవుతుందనీ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక నుంచైనా చిరంజీవి తన అల్లుళ్ళ విషయంలో జాగ్రలు తీసుకోవాలి. లేదంటే అందరూ అనుకున్నదే జరుగుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news