Newsప్రియ‌మ‌ణికి ఆ ఇద్ద‌రు హీరోలంటే అంత క్ర‌షా... ఒక‌రితో ఎ..ర్ కూడానా..!

ప్రియ‌మ‌ణికి ఆ ఇద్ద‌రు హీరోలంటే అంత క్ర‌షా… ఒక‌రితో ఎ..ర్ కూడానా..!

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియమణి. ప్రియమణి కన్నడ అమ్మాయి అయినా కన్నడం కంటే తెలుగులో బాగా పాపులర్ అయింది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది. రాజమౌళి యమదొంగ సినిమాలో ప్రియమణి నటన చూసి ఫిదా అయిపోయాడు, ఆమె చాలా గొప్ప నటి అని పొగడ్తలు కురిపించారంటే ప్రియమణి ఎంత టాలెంట్ ఉన్న అమ్మాయో తెలుస్తోంది.

తాజాగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ప్రియమణి నటించి సందడి చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ కావడంతో ప్రియ‌మణికి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇక ప్రియమణి తన ప్రియుడు ముస్తఫా రాజ్‌ను ప్రేమ వివాహం చేసుకొని బెంగళూరులో ఫ్యామిలీ లైఫ్‌ప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు.. ఇటు బులితెరపై జడ్జిగాను వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటున్నారు.

జవాన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన ఆమె తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరిపై అయినా మీకు ఇష్టం ఉందా ? అనే ప్రశ్న ఆమెకు ఎదురయింది. బాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోలు అంటే తనకు ఇష్టం అని చెబుతూనే తనకు మొదటి నుంచి ఇష్టమైన్న ఏకైక హీరో షారుఖ్ ఖాన్ అని కుండ బద్దలు కొట్టేసింది. షారుక్ తన ఫ‌స్ట్‌ క్రష్ అని చెప్పడమే కాకుండా ఆ హీరో తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమని.. మళ్లీ మళ్లీ ఆయనతో నటించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని ప్రియమణి కామెంట్ చేసింది.

అలాగే ప్రియమణి తెలుగులో జగపతిబాబుకి జోడిగా వరుసగా 3-4 సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఆ సమయంలో కూడా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందన్న ప్రచారం గట్టిగా నడిచింది. ప్రియమణి చెప్పిన చెప్పకపోయినా తెలుగులో ఆమె క్రష్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది జగపతిబాబు అని ఇండస్ట్రీ జనాలు చెవులు కోరుక్కుంటూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news