News' స్కంద ' డిజాస్ట‌ర్ బాధ‌తో హీరో రామ్ ఏం చేస్తున్నాడో...

‘ స్కంద ‘ డిజాస్ట‌ర్ బాధ‌తో హీరో రామ్ ఏం చేస్తున్నాడో చూడండి..!

యంగ్ హీరో రామ్ ఎన్నో ఆశలు.. అంచనాలు పెట్టుకున్న బోయపాటి శ్రీను స్కంద సినిమా ప్లాప్ అయ్యింది. సినిమా అంచనాలు అందుకోలేదు.. సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు.. ఈ సినిమాతో తిరుగులేని బ్లాక్ బస్టర్ కొడతానని.. మాస్లో తిరిగిలేని ఇమేజ్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రామ్‌కు నిరాశే మిగిలింది. ఇక ఈ ప్లాప్ నుంచి బయటికి రావటానికి రామ్ ఫారిన్ వెకేషన్ లో ఎంజాయ్ చేసేవాడు మ‌ధ్య‌లోనే ఆపేసి ఇండియాకు వ‌చ్చేశాడు.

ఇంత భారీ బడ్జెట్ సినిమా ప్లాప్ అయితే… దాని నుంచి బయటికి రావడానికి ఎంత పెద్ద హీరో అయినా వెంటనే కోలుకోరు. స్కంద సినిమా అట్టర్ ప్లాప్ అవడంతో రామ్ తన విదేశీ పర్యటనను మధ్య‌లోనే ఆపేశాడు. స్కంద ప్లాప్ తో ఈ హీరో మరికొన్నాళ్లు విదేశాల్లోనే ఉంటాడని అనుకుంటే… పూర్తిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చేశాడు. విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన రామ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా డబ్బులు ఇస్మార్ట్ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు.

పూరి జగన్నాథ్ – రామ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబుల్‌ ఇస్మార్ట్ తాజా షెడ్యూల్ ముంబైలో మొదలైంది. ఇక రామ్ మరో సినిమాకు షిఫ్ట్ ఇవ్వడంతో అతడు స్కంద‌ పరాజయం నుంచి పూర్తిగా బయటపడినట్టే అనుకోవాలి.

ఆ మధ్య లైగ‌ర్ సినిమా డిజాస్టర్ అవడంతో విజయ్ దేవరకొండ కూడా వెంటనే ఖుషి సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యి లైగర్ డిజాస్టర్ బాధ మరిచిపోయాడు. ఇప్పుడు రామ్ కూడా విజయ్‌ బాటలోనే వెళ్ళినట్టు అనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news