Movies15 ఏళ్ల తరువాత మళ్లీ ఆ హీరోయిన్ తో నటించబోతున్న ప్రభాస్.....

15 ఏళ్ల తరువాత మళ్లీ ఆ హీరోయిన్ తో నటించబోతున్న ప్రభాస్.. డార్లింగ్ కెరీర్ లోనే మోస్ట్ స్పెషల్ మూమెంట్..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భ్ళే సెట్ అవుతూ ఉంటాయి. ఒకసారి సెట్ అయిన తర్వాత అవి మనల్ని మెప్పించిన తర్వాత మళ్ళీ ఆ కాంబో సెట్ అవ్వాలంటే చాలా చాలా టైం పడుతుంది. అలా కొన్ని నెలలు తర్వాత మళ్లీ ఒక క్రేజీ కాంబో సెట్ అవ్వబోతుంది. ఆ కాంబో మరి ఏదో కాదు .. ప్రభాస్ – నయనతార . ఎస్ అప్పుడెప్పుడో యోగి సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఆ తర్వాత తెరపై కనిపించనేలేదు .. బాహుబలి సినిమాలో అవకాశం వచ్చినా సరే నయనతార ఆ సినిమా ఆఫర్ ని రిజెక్ట్ చేసింది . అలా చాలాసార్లు వీళ్ళ కాంబో మిస్ అయింది .

ఫైనల్లీ ఆ కాంబో ని సెట్ చేయబోతున్నాడు మంచు విష్ణు . ఆయన ఎప్పటినుంచో డ్రీం ప్రాజెక్టుగా వెయిట్ చేస్తున్న భక్తకన్నప్ప అధికారికంగా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే . ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మించబోతున్నారు . అంతేకాదు దాదాపు 150 కోట్లు బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది . బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ డైరెక్టర్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నారు.

అయితే ప్రభాస్ ఈ సినిమాలో శివుడు పాత్రలో కనిపించబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్ టేషన్స్ ఉన్నాయి . అయితే ఈ సినిమా నుంచి మరో న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా నయనతార నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ విషయాని నయనతార ఫ్లోలో టంగ్ స్లిప్ అవ్వడం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఈ విధంగా చూసుకుంటే ఈ సినిమాలో ఇంకా ఎంతమంది బిగ్ స్టార్స్ ఉన్నారు అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . మొత్తానికి ఈ సినిమా ద్వారా హిట్టు కొట్టేలాగే ఉన్నాడు మంచు విష్ణు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news