Gossipsరతికకు-రాహుల్ కి మధ్య అంత నడిచిందా..? సర్వం నాకేసి వదిలేసాడా..?

రతికకు-రాహుల్ కి మధ్య అంత నడిచిందా..? సర్వం నాకేసి వదిలేసాడా..?

రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లో చలాకీగా కనిపిస్తున్న ఈ బ్యూటీ గుండెలో ఎంతో బాధను పెట్టుకున్నట్టు నిన్నటి ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. సీజన్ మొదలైన తొలిరోజే తన బ్రేకప్ గురించి బయట పెట్టేసాడు నాగార్జున. హార్ట్ బ్రేక్ నుంచి బయటకు వచ్చావా ? అని అడిగితే హా అంటూ నవ్వుతూనే చేసిందంతా చేసి ఎంత బాగా నవ్వుతున్నారో అని నాగ్‌నే రతిక‌ నిలదీసింది.

మధ్యలో నేను ఏం చేశాను ? అమ్మ అని నాగార్జున అంటే మొత్తం మీరే చేశారు అంటూ ర‌తిక‌ చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అసలు రతిక బ్రేకప్ కు నాగార్జున్ కు సంబంధం ఏంటి ? అని ఎవరికి అర్థం కాలేదు. ఇక అసలు విషయంలోకి వెళ్తే రతికను బాధపెట్టిన ఆ వ్యక్తి ఎవరో కాదు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అని తేలిపోయింది. పిల్ల పిల్ల భూలోకం దాదాపు కన్నుమూయి వేళ అనే పాట ప్రోమో వదిలి హింట్‌ ఇచ్చాడు.

బిగ్ బాస్ అప్పట్లో పునర్నవి భూపాలం కోసం ఈ పాట పాడాడు. రాహుల్ ఇప్పుడు ర‌తిక‌ కోసం మరోసారి ఈ పాట అప్లై చేసినట్టు కనిపిస్తోంది. అయితే రాహుల్ – రితిక బంధం నిజమే అంటూ సోషల్ మీడియాలో బోలెడన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి. రాహుల్ గతంలో ప్రైవేట్ ఆల్బమ్ చేసేవాడు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్టు తెలుస్తోంది.

అయితే రాహుల్ బిగ్ బాస్ కు వెళ్లాక పున‌ర్న‌వితో లవ్ ట్రాక్ నడపడంతో వీరి ధ్య మనస్పర్ధలు వచ్చి చివరికి వీరిద్దరూ విడిపోయినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ మూడో సీజన్లో రాహుల్ – పునర్నవి మధ్య ల‌వ్ ట్రాక్ నడుపుతున్నట్టు చెప్పింది కూడా నాగార్జునే. పదేపదే వీరి మధ్య ఏదో ఉందన్నట్టుగా నాగార్జున కామెంట్లు చేశాడు. అందుకే ఇప్పుడు రతిక కూడా మీరే చేసిందల్లా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ?అడుగుతున్నారా అని కామెంట్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news