Newsఅవార్డులు ప‌ర‌మ చెత్త‌... నాకు ఇస్తే ఏం చేస్తానంటే... హీరో విశాల్...

అవార్డులు ప‌ర‌మ చెత్త‌… నాకు ఇస్తే ఏం చేస్తానంటే… హీరో విశాల్ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!

తమిళ స్టార్ హీరో విశాల్ వరుస‌పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా ఈనెల 15న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. రీతు వర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎస్ జె సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్యపాత్రలు పోషించారు.

తాజాగా ఈ సినిమా యూనిట్ చెన్నైలో నిర్వహించిన సమావేశంలో విశాల్ పాల్గొన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రశ్నించగా విశాల్‌ షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు అవార్డులపై ఎలాంటి నమ్మకం లేదని.. ఒకవేళ తనకు అవార్డులు వస్తే వాటిని చెత్త‌బట్టలో పడేస్తానని విమర్శించారు.

నాకు అవార్డులపై ఎప్పుడు ఇలాంటి నమ్మకం లేదు.. ప్రజలు అభిమానులు ఇచ్చేదే నిజమైన అవార్డు ప్రేక్షకుల ఆశీస్సులతోనే నేను ఇండస్ట్రీలో నిల దొక్కుకున్నా.. ఒకవేళ నా చిత్రాలకు అవార్డులు వచ్చినా వాటిని చెత్తబుట్టలో పడేస్తా అని ఒక్కసారిగా విశాల్‌ చేసిన‌ కామెంట్స్ పై దుమారం జరిగింది.

ఇక పొలిటికల్ ఎంట్రీ పై విషయాలు ప్రశ్నించగా జీవితంలో ఏదైనా జరగవచ్చు.. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు అది మన చేతుల్లో లేదు అంటూ బ‌దులిచ్చాడు. ఇక విశాల్‌ ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news