Newsనాపై బ్యాడ్ ప్ర‌చారం... అన్నీ నాకు తెలుసంటూ మంచు మ‌నోజ్ సంచ‌ల‌నం..!

నాపై బ్యాడ్ ప్ర‌చారం… అన్నీ నాకు తెలుసంటూ మంచు మ‌నోజ్ సంచ‌ల‌నం..!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ వెండి తెరపై కనిపించి చాలా కాలమే అయింది. మనోజ్ నటించిన చివరి సినిమా ఒక్కడు మిగిలాడు.. 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలలో మంచు మనోజ్ గెస్ట్ గా మెరిశాడే తప్ప హీరోగా ఒక్క సినిమాలోను కనిపించలేదు. దీంతో మనోజ్ పని అయిపోయింది.. సినిమాలుకు గుడ్ బై చెప్పేసాడు అంటూ కావాలని కొందరు ప్రచారం చేశారు.

కచ్చితంగా అదే టైంలో అహం బ్రహ్మసి అనే సినిమా ప్రకటించిన ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవ‌ల‌ గుడ్ న్యూస్ అంటూ వాట్ ద ఫిష్ అనే సినిమా ప్రకటించాడు. మనం మనం బరంపురం అనేది సినిమా ట్యాగ్ లైన్. సేమ్ టు సేమ్ ఈ సినిమా గురించి కూడా మళ్లీ ఎలాంటి అప్డేట్లు బయటకు రావడం లేదు. దీంతో చాలామంది మనోజ్ ఇక సినిమాలు చేయడు అంటూ ఒకటే ప్రచారం మొదలుపెట్టారు.

ఈ టైంలో తాను ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నట్టు అనూహ్యంగా ప్రకటన చేశాడు. మనోజ్ ఓటీటీ కోసం ర్యాంప్ ఆడిద్దాం అనే షో చేయబోతున్నట్టు వెల్లడించాడు. ఈ టీవీ షో కి తను వ్యాఖ్యాత‌గా వ్యవహరించినట్టు తెలిపాడు. ఈ మేరకు ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది. నా ప్రపంచం సినిమా.. నేను చిన్నప్పటి నుంచి సినిమా మీద పెంచుకున్న ప్రేమ ప్రొఫెషన్ గా మారింది.. నన్ను ఒక నటుడుగాను హీరోగాను చేసింది రాకింగ్ స్టార్ అనే పేరు కూడా ఇచ్చింది థ్యాంక్స్..!

విజిల్స్, అరుపులు, కేకలు ఇలా ఓ పండగలా జరిగిన నా జీవితంలోకి సడన్గా ఒక సైలెన్స్ వచ్చింది. మనోజ్ అయిపోయాడన్నారు.. కెరీర్ కతం అన్నారు.. యాక్టింగ్ ఆపేసాడు ఇక తిరిగి రాడు అన్నారు.. ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గిందన్నారు.. విన్నాను చూశాను మౌనంగా భరించాను.. తిరిగి వస్తున్నాను అంటూ ఈ ప్రోమోలో చెప్పుకొచ్చాడు. మనోజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ గా మారాయి. మనోజ్ ఎవరు అయితే తనను టార్గెట్ చేస్తూ ప్రచారం చేశారో వాళ్లకు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేశాడన్న గుసగుసలు అయితే టాలీవుడ్ లో నడుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news